News March 5, 2025
వివేకా హత్య కేసులో ప్రత్యక్ష సాక్షి రంగన్న మృతి

AP: వివేకా హత్య కేసులో ప్రత్యక్ష సాక్షి అయిన రంగన్న(85) కడప రిమ్స్లో మృతిచెందారు. కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన్ను పులివెందుల నుంచి కడప తీసుకురాగా చికిత్స పొందుతూ ఇవాళ చనిపోయారు. రంగన్న వివేకా హత్య జరిగిన సమయంలో ఆ ఇంటికి వాచ్మెన్గా పనిచేశారు.
Similar News
News September 1, 2025
ALERT: ఇవాళ భారీ వర్షాలు

బంగాళాఖాతం మీదుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని, దీంతో APలో రేపు అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని APSDMA తెలిపింది. దీని ప్రభావంతో 3 రోజులపాటు వానలు పడతాయంది. ఇవాళ SKLM, VZM, మన్యం, అల్లూరి, VSP, అనకాపల్లి, KKD, ఏలూరు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయంది. అటు TGలో ఆసిఫాబాద్, MNCL, NRML, పెద్దపల్లి, భూపాలపల్లి, MLG, భద్రాద్రి, కొత్తగూడెం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని IMD తెలిపింది.
News September 1, 2025
ఇక సోలోగా ఎవరెస్ట్ ఎక్కడం కుదరదు

పర్వతారోహణకు నేపాల్ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త రూల్స్ నేటి నుంచి అమల్లోకొచ్చాయి. ఎవరెస్ట్ లాంటి 8000 మీటర్ల కంటే ఎత్తైన పర్వతాలను ఎక్కాలంటే ఇద్దరు సభ్యుల టీమ్ వెంట కనీసం ఒక మౌంటేన్ గైడ్ తప్పనిసరి. ఒంటరిగా ఎక్కాలనుకునే ఔత్సాహికులకు ఇది పెద్ద ఎదురుదెబ్బ. అటు సీజన్ల వారీగా మౌంటేన్ క్లైంబింగ్ ఫీజును ప్రభుత్వం భారీగా పెంచింది. MAR-MAY మధ్య ఎవరెస్ట్ ఎక్కాలంటే ఒక్కొక్కరు రూ.13.2 లక్షలు కట్టాల్సిందే.
News September 1, 2025
కమర్షియల్ సిలిండర్ ధర తగ్గింపు

దేశ వ్యాప్తంగా కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలను తగ్గించినట్లు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ప్రకటించాయి. 19 కేజీల సిలిండర్ ధరను రూ.51.50 తగ్గించాయి. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో సిలిండర్ రేట్ రూ.1,580కి చేరింది. తగ్గించిన ధరలు ఇవాళ్టి నుంచి అమల్లోకి వచ్చాయి. అటు గృహ అవసరాలకు ఉపయోగించే డొమెస్టిక్ సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పులు చేయలేదు.