News March 5, 2025
పెద్దపల్లి: ఇంటర్ మొదటిరోజు పరీక్ష ప్రశాంతం

పెద్దపల్లి జిల్లాలో ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు మొదటి రోజు బుధవారం ప్రశాంతంగా జరిగాయని ఇంటర్మీడియట్ జిల్లా అధికారి కల్పన తెలిపారు. తెలుగు, హిందీ, ఉర్దూ భాష పరీక్షలు జరిగాయి అన్నారు. ఈ పరీక్షకు (5341) మంది హాజరుకావాల్సి ఉండగా, (5154)మంది హాజరు కాగా (187) మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని తెలిపారు. తొలి రోజు 96 % హాజరు నమోదయ్యిందన్నారు.
Similar News
News March 25, 2026
అలా చేస్తే పంత్ ఆట మెరుగవుతుంది: డుప్లెసిస్

LSG కెప్టెన్ పంత్ టెస్టుల్లాగే T20ల్లోనూ తన ఆటకు సంబంధించి ఓ బ్లూ ప్రింట్ రెడీ చేసుకోవాలని మాజీ క్రికెటర్ డుప్లెసిస్ సూచించారు. ‘T20ల్లో మెరుగ్గా ఎలా ఆడాలో పంత్ ఒక గేమ్ ప్లాన్ కనుక్కోవాలి. ప్రతి బాల్ గురించి ముందుగానే ఆలోచించొద్దు. తొలి 6 బంతులు ఆయన ఎలా ఆడతారనేదే ముఖ్యం. నంబర్స్ పరంగా ఆయన ఇంకా హై ఇంపాక్ట్ చూపించాలని కోరుకుంటున్నా’ అని జియో హాట్స్టార్ IPL లైవ్ షోలో వ్యాఖ్యానించారు.
News March 25, 2026
పాత తాలూకా.. నిడమనూరును నియోజకవర్గంగా మార్చాలి

నియోజకవర్గాల పునర్విభజన సెగ ఉమ్మడి నల్గొండలో మొదలైంది. కొత్తగా 6 అసెంబ్లీ స్థానాలు పెరుగుతాయన్న ప్రచారంతో, పాత తాలూకా కేంద్రమైన నిడమనూరును నూతన నియోజకవర్గంగా ప్రకటించాలని స్థానిక యువత, మేధావులు డిమాండ్ చేస్తున్నారు. నిడమనూరుతో పాటు అడవిదేవులపల్లి, త్రిపురారం, మాడుగులపల్లి మండలాలు.. కొత్తగా ప్రతిపాదిత తుమ్మడం, ఎర్రబెల్లి మండలాలను కలిపి అసెంబ్లీ స్థానాన్ని ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.
News March 25, 2026
సిద్దిపేట: పెట్రోల్, డీజిల్ కొరత లేదు

పెట్రోల్, డీజిల్ కొరత లేదని తప్పుడు వార్తలు నమ్మి వాహనదారులు ఆందోళనకు గురికావద్దని తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మర్రి అమరేందర్ రెడ్డి పేర్కొన్నారు. భయాందోళన కారణంగా కొనుగోళ్ల అమ్మకాలు సాధారణ కంటే 3 రెట్లు అసాధారణంగా పెరిగాయని ఫలితంగా తాత్కాలికంగా సరకు నిండుకుపోయిందన్నారు. HPCL, IOCL, BPCL వద్ద తగినంత స్టాక్ అందుబాటులో ఉందని సరఫరా గొలుసులు సాధారణంగా పనిచేస్తాయని పేర్కొన్నారు.


