News March 5, 2025

బ్లూఫ్లాగ్ పున‌రుద్ద‌ర‌ణ‌కు యుద్ధ‌ప్రాతిప‌దిక చ‌ర్య‌లు చేప‌ట్టాలి: కలెక్టర్

image

బ్లూఫ్లాగ్ పునరుద్ధ‌ర‌ణ జ‌రిగేలా రుషికొండ బీచ్‌లో యుద్ధ‌ప్రాతిపాదిక‌న చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని అధికారుల‌ను క‌లెక్ట‌ర్ హ‌రేంధిర ప్ర‌సాద్ ఆదేశించారు. బుధవారం ఆయన రుషికొండ బీచ్‌ను సంద‌ర్శించారు. ప‌రిశ‌స‌రాల్లో క‌లియ‌తిరిగిన ఆయ‌న అక్క‌డ ప‌రిస్థితుల‌ను గ‌మ‌ణించారు. ప‌ర్యాట‌కుల వాహ‌నాల పార్కింగ్ ప‌రిశీలించారు. దుకాణాల స‌ముదాయాలు, పారిశుద్ధ్య నిర్వ‌హ‌ణ‌పై అధికారుల‌కు మార్గ‌ద‌ర్శ‌కాలు జారీ చేశారు.

Similar News

News March 6, 2025

హనుమంతవాక జంక్షన్లో యాక్సిడెంట్

image

హనుమంతవాక జంక్షన్లో గురువారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.  బైక్‌పై వెళ్తున్న వ్యక్తిని లారీ ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుని వివరాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. బుధవారం తెల్లవారుజామున అతివేగంగా వెళ్తున్న ఇద్దరు యువకులు మృతి చెందిన సంగతి తెలిసిందే. వరుస ఘటనలో నగరవాసులు ఆందోళన చెందుతున్నారు. ట్రాఫిక్ పోలీసులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

News March 6, 2025

విశాఖ: యువకుల ప్రాణం తీసిన అతివేగం..!

image

రైల్వే న్యూకాలనీ సమీపంలో బుధవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదానికి అతివేగమే కారణమని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనలో తిక్కవానిపాలేనికి చెందిన వాసుపల్లి గోపి కుమారుడు యశ్వంత్(21), గొడుగు అచ్చిరాజు కొడుకు సాయికుమార్(20) <<15656341>>మృతి చెందారు<<>>. యశ్వంత్ కుటుంబం బతుకుతెరువు కోసం ఎస్.రాయవరం నుంచి నగరానికి వలస వచ్చారు. కాగా ప్రమాదం జరిగిన సమయంలో బైక్ 120 స్పీడ్‌లో నడిపి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.

News March 6, 2025

శ్రీకాకుళం వరకే విశాఖ-పలాస పాసింజర్

image

విశాఖ-పలాస రైల్వే లైన్‌లో సాంకేతిక సమస్యల కారణంగా విశాఖ-పలాస పాసింజర్ (67289/90)శ్రీకాకుళం వరకు మాత్రమే నడపనున్నట్లు వాల్తేర్ డివిజన్ డీసీఎం సందీప్ తెలిపారు. మార్చ్ 9 నుంచి మార్చ్ 16 వరకు(శుక్రవారం, ఆదివారం మినహాయించి) ఈ రైళ్ళు శ్రీకాకుళం వరకు మాత్రమే వెళ్తుందన్నారు. తిరుగు ప్రయాణంలో పలాసకు బదులుగా శ్రీకాకుళం నుంచి బయలుదేరనున్నట్లు తెలిపారు. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలన్నారు.

error: Content is protected !!