News March 5, 2025

NLG: ‘సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలి’

image

సైబర్ నేరాలపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని సైబర్ క్రైమ్ డిఎస్పీ లక్ష్మీనారాయణ తెలిపారు. సైబర్ జాకృత్క దివాస్ సందర్భంగా నల్గొండ పట్టణంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీలో సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సైబర్ నేరాలు పని రకాలు ఉంటాయని, వాటిపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలన్నారు.

Similar News

News March 2, 2026

NLG: ఇంటర్ పరీక్షల్లో ఇవాళ 441 మంది డుమ్మా!

image

జిల్లాలో సోమవారం జరిగిన ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. మొత్తం 441 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు డిఐఈఓ దస్రూనాయక్ తెలిపారు. జనరల్ విభాగంలో మొత్తం 12,758, మంది విద్యార్థులకు గాను 12455 మంది హాజరుకాగా, 303 మంది గైర్హాజరయ్యారు. వొకేషనల్ విభాగంలో 1964 మంది విద్యార్థులకు గాను 1826 మంది హాజరుకాగా, 138 మంది గైర్హాజరయ్యారు.

News March 2, 2026

పెండింగ్ స్కాలర్‌షిప్‌లు, ఉపాధి హామీపై కలెక్టర్ సీరియస్

image

జిల్లాలో రానున్న కఠిన వేసవిని దృష్టిలో ఉంచుకుని ముందస్తు కార్యాచరణ సిద్ధం చేయాలని కలెక్టర్ బి. చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. తక్షణమే మండల స్థాయిలో సమావేశాలు నిర్వహించి క్షేత్రస్థాయి పరిస్థితులను అంచనా వేయాలన్నారు. ముఖ్యంగా విద్యార్థుల పెండింగ్ స్కాలర్‌షిప్‌ల మంజూరుపై ప్రత్యేక దృష్టి సారించాలని, ఉపాధి హామీ పనులను వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

News March 2, 2026

మార్చి 31లోగా లక్ష్యాలను పూర్తి చేయాలి: కలెక్టర్

image

ఆర్థిక సంవత్సరం ముగియనున్న తరుణంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ బి. చంద్రశేఖర్ ఆదేశించారు. సోమవారం నిర్వహించిన ‘ప్రజావాణి’ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రజల ఫిర్యాదులను స్వీకరించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రజల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని, ముఖ్యంగా LRS దరఖాస్తుల ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులకు స్పష్టం చేశారు. మార్చి 31 లోగా నిర్దేశిత లక్ష్యాలన్నింటినీ పూర్తి చేయాలని ఆదేశించారు.