News March 5, 2025

నంద్యాల జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

☞ జగన్.. జైలుకు తక్కువ.. బెయిల్‌కు ఎక్కువ: ఎంపీ శబరి ☞ కాకనూరులో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన మహిళ మృతి ☞ నిధులు కేటాయించాలని మంత్రి బీసీకి ఎమ్మెల్యేల వినతులు ☞ కొలిమిగుండ్ల పోలీసులకు అభినందనల వెల్లువ ☞ పత్రాల జారీలో జాప్యాన్ని నివారించండి: కలెక్టర్ ☞ శ్రీశైల మల్లన్న హుండీ ఆదాయం రూ.5.69 కోట్లు ☞ అహోబిలం బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు పూర్తి: ఈవో మురళీధరన్ ☞ పాడి పెంపకంపై RAHTCలో ఉచిత శిక్షణ

Similar News

News July 6, 2025

ఆ చిన్నారే ఇప్పుడు హీరోయిన్‌గా ఎంట్రీ..

image

బాలీవుడ్ హీరో రణ్‌వీర్ సింగ్ ‘ధురంధర్’ ఫస్ట్ <<16964615>>గ్లింప్స్<<>> తాజాగా విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్‌గా సారా అర్జున్ ఎంట్రీ ఇస్తున్నారు. ఈమె ఎవరో కాదు చియాన్ విక్రమ్ ‘నాన్న’ సినిమాలో నటించిన చిన్నారి. బాలనటిగా పలు తమిళ, మలయాళ చిత్రాల్లో నటించారు. దీంతో పాటు యాడ్స్‌లోనూ మెరిశారు. హీరోయిన్‌గా తొలి సినిమానే స్టార్ సరసన నటించే ఛాన్స్ కొట్టేశారు. ఆమె నాన్న రాజ్ అర్జున్ కూడా నటుడే.

News July 6, 2025

పెద్దపల్లి: జీవో నెంబర్‌ 282ను రద్దు చేయాలి

image

జీవో నెంబర్‌ 282ను వెంటనే రద్దు చేయాలని CITU నాయకులు డిమాండ్‌ చేశారు. పెద్దపల్లిలోని అంబేద్కర్‌ విగ్రహం వద్ద ఆదివారం CITU ఆధ్వర్యంలో జీవో నెంబర్‌ 282 ప్రతులను దహనం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు శ్రమశక్తిని దోచి, కార్పొరేట్లకు అధిక లాభాలను కట్టబెట్టేందుకు ప్రయత్నం చేస్తున్నాయని నాయకులు అన్నారు. 8గంటల పని విధానాన్ని 10గంటలుగా మారుస్తూ చేసిన ఈ జీవోను వెంటనే రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు.

News July 6, 2025

NZB: రూ.500 కోట్లతో ఎరుకల కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి: కవిత

image

కాంగ్రెస్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు రూ.500 కోట్లతో ఎరుకల కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. ఆదివారం ఏకలవ్య జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి నివాళి అర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎరుకల సామాజికవర్గానికి అన్ని పార్టీలు రాజకీయంగా అవకాశాలు కల్పించాలని సూచించారు.