News March 6, 2025
ప.గో జిల్లా TODAY TOP HEADLINES…

✷ TPG: జగన్పై ఎమ్మెల్యే బొలిశెట్టి ఫైర్ ✷ భీమవరం: 6న గీత కులాల మద్యం షాపుల డ్రా ✷మాజీ ఎమ్మెల్యే పాడె మోసిన తణుకు ఎమ్మెల్యే ✷ ప.గో: నిధులు వినియోగంలో ఏపీఐఐసీ తీవ్ర జాప్యం✷ నరసాపురంలో 8 కేజీల వెండి చోరీ ✷అత్తిలి: స్నేహితుల మధ్య ఘర్షణ..వ్యక్తి హత్య✷ నిడమర్రు: ఆక్వా రైతు ఆత్మహత్య✷ ఏలూరు: రాజకీయ ప్రత్యర్థుల ఆత్మీయ అనుబంధం ✷ కాళ్ల: ఎమ్మెల్సీ పేరాబత్తులను అభినందించిన RRR
Similar News
News March 17, 2026
ఎస్పీ కార్యాలయంలో పీజీఆర్ఎస్.. 24 అర్జీల స్వీకరణ

పాలకోడేరు మండలం గొల్లలకోడేరు జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ‘పీజీఆర్ఎస్’ కార్యక్రమంలో SP అద్నాన్ నయీం అస్మి 24 అర్జీలను స్వీకరించారు. వీటిలో కుటుంబ కలహాలు, సైబర్ నేరాలు, భూ వివాదాలపై ఫిర్యాదులు అందాయి. బాధితులకు త్వరితగతిన న్యాయం చేయాలని అధికారులను SP ఆదేశించారు. శాంతిభద్రతల పరిరక్షణలో రాజీ పడేది లేదని ఆయన స్పష్టం చేశారు.
News March 17, 2026
ఏలూరు రాజకీయాల్లో “పుట్టా“ రచ్చ

ప్రశాంతతకు మారుపేరుగా ఉన్న ఏలూరు రాజకీయాల్లో హైదరాబాద్ ఫాంహౌస్ ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. డ్రగ్స్ తీసుకునే పార్టీలో ఎంపీ పట్టుబడటం అనేది రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఎంపీ డ్రగ్స్ తీసుకున్నారని టెస్ట్లో పాజిటివ్ రావడాన్ని ఈగల్ టీమ్ SP ధృవీకరించారు. అయితే తాను ఏ తప్పు చేయలేదని నిర్దోషిగా బయటకొస్తానని MP అంటున్నారు. ఇటు టీడీపీ శ్రేణులు సైతం ఎంపీపై కుట్ర జరుగుతోందంటూ కౌంటర్ ఎటాక్ చేస్తున్నారు.
News March 17, 2026
భీమవరం: ‘ఎండ తీవ్రతను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి’

రాబోయే వేసవిలో ఎండ తీవ్రతను ఎదుర్కొనేందుకు అధికారులు ముందస్తు చర్యలతో సిద్ధంగా ఉండాలి కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు. ఈ మేరకు సంబంధిత అధికారులతో భీమవరం కలెక్టరేట్లో సమీక్ష సోమవారం సమావేశాన్ని నిర్వహించారు. ప్రజలు అధికంగా రాకపోకలు చేసే ముఖ్య కూడళ్లు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, ఆసుపత్రులు, పాఠశాలలు వంటి ప్రదేశాలను గుర్తించి అక్కడ తాగునీటి సదుపాయం కల్పించాలని అధికారులను ఆదేశించారు.


