News March 6, 2025
రెండు జతల ఏకరూప దుస్తులు అందించాలి: కలెక్టర్

రెండు జతల ఏకరూప దుస్తులను సకాలంలో విద్యార్థులకు అందించాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు.బుధవారం జిల్లా కలెక్టర్ కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో ఏకరూప దుస్తుల తయారీపై సంబంధిత జిల్లా అధికారులు, ఏపీఎంలతో సమీక్ష నిర్వహించారు. విద్యార్థుల కొలతలకు అనుగుణంగా నాణ్యతతో కుట్టాలని సూచించారు. నిర్దేశించిన గడువులోగా తయారీ ప్రక్రియ పూర్తయ్యేలా చూడాలన్నారు.
Similar News
News January 14, 2026
ధోనీకే సాధ్యం కానిది.. రాహుల్ రికార్డు

భారత ప్లేయర్ KL రాహుల్ ధోనీకి కూడా సాధ్యం కాని ఘనత సాధించారు. వన్డేల్లో న్యూజిలాండ్పై సెంచరీ చేసిన తొలి భారత వికెట్ కీపర్ బ్యాటర్గా రికార్డులకెక్కారు. రాజ్కోట్ వేదికగా వన్డేల్లో శతకం చేసిన తొలి ఇండియన్ కూడా ఈయనే. ఓవరాల్గా రాహుల్కిది వన్డేల్లో ఎనిమిదో సెంచరీ. ఈ ఏడాదిలో భారత్ తరఫున ఇదే తొలి అంతర్జాతీయ శతకం. సెంచరీ చేసిన సమయంలో తన కూతురుకు అంకితం ఇస్తున్నట్లుగా రాహుల్ సెలబ్రేట్ చేసుకున్నారు.
News January 14, 2026
మేము కాకుంటే రష్యా, చైనా గ్రీన్ల్యాండ్ను సొంతం చేసుకుంటాయి: ట్రంప్

తమ నేషనల్ సెక్యూరిటీ కోసం గ్రీన్ల్యాండ్ అవసరం అని అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ మరోసారి స్పష్టం చేశారు. తాము అమెరికాలో చేరబోమని, డెన్మార్క్లోనే ఉంటామని గ్రీన్ల్యాండ్ ప్రధాని ప్రకటించడంపై ట్రంప్ స్పందించారు. ‘గ్రీన్ల్యాండ్ అమెరికా చేతుల్లో ఉండటం వల్ల నాటో మరింత స్ట్రాంగ్ అవుతుంది. మేము కాకుంటే రష్యా, చైనా గ్రీన్ల్యాండ్ను సొంతం చేసుకుంటాయి. అది జరగనివ్వను’ అని పోస్ట్ చేశారు.
News January 14, 2026
విశాఖ నుంచి వందే భారత్ రైళ్లు అదనంగా నడపాలని లేఖ

విశాఖపట్నం విమానాశ్రయం జూన్–జులై నెలల్లో భోగాపురానికి మారనున్న నేపథ్యంలో నగరం నుంచి అదనంగా వందేభారత్ రైళ్లు ప్రవేశపెట్టాల్సిన అవసరం ఉందని నార్త్ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్కు లేఖ రాశారు. విశాఖపట్నం నుంచి విజయవాడ, హైదరాబాద్, తిరుపతి, బెంగళూరు, చెన్నై వంటి ప్రధాన నగరాలకు ప్రయాణికుల రద్దీ మరింత పెరగనుందని లేఖలో వివరించారు.


