News March 6, 2025
WGL: ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ టైమింగ్స్

నేటి నుంచి పదో తరగతి విద్యార్థులకు ప్రీ ఫైనల్ పరీక్షలను నిర్వహిస్తున్నామని జిల్లా విద్యాశాఖ అధికారి జ్ఞానేశ్వర్ తెలిపారు. రంజాన్ ఉపవాసాల దృష్ట్యా రాష్ట్ర విద్యాశాఖ డైరెక్టర్ ఆదేశాల మేరకు పరీక్ష సమయంలో మార్పులు జరిగాయన్నారు. మధ్యాహ్నం 1.15 నుంచి 4.15 గంటల నిర్వహించే పరీక్షల సమయం మధ్యాహ్నం 12.15 నుంచి 3.15కు మార్చినట్లు చెప్పారు. ఈనెల 6నుంచి 15 వరకు ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ నిర్వహిస్తున్నారు.
Similar News
News November 13, 2025
ఖమ్మం: 208 స్కూళ్లకు 26 మందే..

విద్యార్థులు క్రీడల్లో రాణించడంలో పీఈటీల పాత్ర ఎంతో కీలకం. అయితే జిల్లాలో వారి కొరత తీవ్రగా వేధిస్తోంది. జిల్లాలోని 208 ఉన్నత పాఠశాలల్లో విద్యార్థులకు శిక్షణ ఇచ్చేందుకు కేవలం 11 మంది పీడీలు, 15 మంది పీఈటీలు మాత్రమే ఉన్నారు. అంటే మొత్తంగా 26 మందితోనే నెట్టుకొస్తున్నారు. శారీరక వికాసానికి క్రీడలు తప్పనిసరైనా తర్ఫీదు ఇచ్చేవారు లేకపోవడంతో ప్రతిభ ఉన్నా విద్యార్థులు స్వయంగా సిద్ధమవ్వాల్సి వస్తోంది.
News November 13, 2025
సీఎం, పీఎంను తొలగించే బిల్లు.. జేపీసీలో మన ఎంపీలకూ చోటు

ప్రజాప్రతినిధుల తొలగింపు బిల్లుపై కేంద్రం <<18272673>>ఏర్పాటు<<>> చేసిన జాయింట్ పార్లమెంటరీ కమిటీ(JPC)లో తెలుగు రాష్ట్రాల నుంచి పలువురికి అవకాశం లభించింది. బీజేపీ ఎంపీలు డీకే అరుణ, కె.లక్ష్మణ్, ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ, టీడీపీ ఎంపీ లావు కృష్ణదేవరాయలు, జనసేన ఎంపీ బాలశౌరి, వైసీపీ ఎంపీ నిరంజన్ రెడ్డికి చోటు దక్కింది. కాంగ్రెస్ సహా ఇండీ కూటమిలోని కీలక పార్టీలు జేపీసీని బహిష్కరించాయి.
News November 13, 2025
నెల్లూరు: సాయం కోసం 12,293 మంది రైతుల ఎదురుచూపులు

అన్నదాత సుఖీభవ కింద ఖాతాలకు జమ కావలసిన రూ.20 వేల కోసం నెల్లూరు జిల్లాలోని 12,293 మంది రైతులు ఎదురుచూపులు చూస్తున్నారు. జిల్లాలో ఇప్పటికే 2 లక్షల మందికి పైగా రైతులకు జమ అయింది. కానీ సాంకేతిక కారణాలతో జమ కాని 12,293 మంది రైతులు సాయం కోసం ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. కోర్టు వివాదాల కారణంగా ఆగినవి కాకుండా మిగిలిన అన్నీ కూడా అధికారులు తగిన శ్రద్ధ చూపిస్తే సత్వరమే పరిష్కారం అయ్యేవేనని సమాచారం..


