News March 6, 2025
పశువులు పట్టివేత.. 8మంది అరెస్ట్

అక్రమంగా పశువులను తరలిస్తున్న 8 మందిని వెంకటాపురం పోలీసులు పట్టుకొని అరెస్టు చేశారు. సిఐ కుమార్ తెలిపిన వివరాలు.. చర్ల నుంచి HYDకు అక్రమంగా పశువులు తరలిస్తున్నారని సమాచారంతో చొక్కాల గ్రామ సమీపంలో తనిఖీలు నిర్వహించారు. 4 బొలెరో వాహనాలను పట్టుకున్నట్లు తెలిపారు. వాహనాల్లోని 42 పశువులను గోశాలకు తరలించి, 8 మందిపై కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.
Similar News
News September 17, 2025
విశాఖ: మెడికల్ కాలేజీలో విద్యార్థి ఆత్మహత్య

విశాఖలోని ఓ వైద్య కళాశాలలో చదువుతున్న విద్యార్థి బుధవారం మేడ మీద నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం చంబా జిల్లాకు చెందిన విస్మద్ సింగ్గా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. విద్యార్థి ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
News September 17, 2025
సూర్యాపేట-గరిడేపల్లి హైవేపై యాక్సిడెంట్

గరిడేపల్లి మండలం పొనుగోడు గ్రామ శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నేరేడుచర్ల మండలం ఫతేపురం గ్రామానికి చెందిన శ్రీనివాస్ టీవీఎస్ ఎక్సెల్పై ప్రయాణిస్తుండగా సూర్యాపేట-గరిడేపల్లి రహదారిపై లారీ ఢీకొంది. ఈ ఘటనలో శ్రీనివాస్ అక్కడికక్కడే మృతి చెందారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News September 17, 2025
ఏడాదికి రూ.50వేల స్కాలర్షిప్.. APPLY

బాలికలను టెక్నికల్ విద్యలో ప్రోత్సహించేందుకు కేంద్ర విద్యాశాఖ ఆధ్వర్యంలో AICTE ప్రగతి స్కాలర్షిప్లు అందిస్తోంది. ప్రస్తుత విద్యా సంవత్సరంలో డిప్లొమా, ఇంజినీరింగ్ డిగ్రీ చదువుతున్నవారు OCT 31 వరకు <