News March 6, 2025
మద్యం మత్తులో పురుగుమందు తాగి వ్యక్తి మృతి

పురుగుమందు తాగి ఒకరు చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన మండలంలోని చైన్ పాక గ్రామంలో జరిగింది. పోలీసులు కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన పెద్ది కిష్టస్వామి(60) తరచూ మద్యం తాగుతూ భార్యతో గొడవ పడుతుండేవాడు.ఈ క్రమంలో భార్య మద్యం తాగితే ఇల్లు ఎలా గడవాలి అని అడిగింది. దీంతో మద్యం మత్తులో పురుగుమందు తాగాడు. గమనించిన స్థానికులు దవాఖానాకి తరలించగా పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ మృతి చెందాడు.
Similar News
News March 1, 2026
వాడపల్లి వేంకన్న భక్తులకు అలర్ట్

మార్చి 3వ తేదీ మంగళవారం చంద్రగ్రహణం కారణంగా ఆత్రేయపురం మండలం వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని ఉదయం 9 గంటలకు మూసివేయనున్నట్లు EO చక్రధర్ రావు ఆదివారం తెలిపారు. ఆ రోజు ఉదయం 9 గంటల వరకు మాత్రమే పూజలు జరుగుతాయని పేర్కొన్నారు. మరుసటి రోజు బుధవారం (4వ తేదీ) ఉదయం సంప్రోక్షణ అనంతరం, ఉదయం 6 గంటల నుంచి భక్తులకు దర్శనాలు పునరుద్ధరిస్తామని వెల్లడించారు. భక్తులు ఈ మార్పును గమనించాలని కోరారు.
News March 1, 2026
అశ్వారావుపేట: ఆయిల్పామ్ రైతులకు గుడ్ న్యూస్

తెలంగాణ ప్రభుత్వ ప్రోత్సాహంతో ఆయిల్పామ్ సాగు రైతులకు లాభాల బాట చూపుతోంది. తాజాగా టన్ను గెల ధర రూ.21,546లకు చేరడంతో సాగుదారుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. దీనివల్ల సుమారు 15,024 మంది రైతులకు రూ.2 కోట్ల అదనపు ఆదాయం సమకూరింది. రాష్ట్రవ్యాప్తంగా 10 లక్షల ఎకరాల్లో ఈ పంటను సాగు చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం రాయితీలు, రాయల్టీని అందిస్తోంది. అధిక ఆదాయం లభిస్తుండటంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
News March 1, 2026
సీనియారిటీ జాబితాపై అభ్యంతరాల సేకరణ: విశాఖ డీఈవో

జిల్లాలో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయుల సాధారణ సీనియార్టీ జాబితాపై అభ్యంతరాలను సేకరించినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి ప్రేమ్ కుమార్ వెల్లడించారు. జిల్లా పరిషత్, మండల పరిషత్, మున్సిపల్ కార్పొరేషన్ ఉపాధ్యాయుల్లో సీనియార్టీ జాబితాను వెబ్సైట్లో పొందుపరిచామన్నారు. దీనిపై అభ్యంతరాలను 7వ తేదీలోగా తెలియజేయాలని కోరారు. గడువు దాటిన తర్వాత అభ్యంతరాలను స్వీకరించబోమని ఆయన స్పష్టం చేశారు.


