News March 6, 2025

మద్యం మత్తులో పురుగుమందు తాగి వ్యక్తి మృతి

image

పురుగుమందు తాగి ఒకరు చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన మండలంలోని చైన్ పాక గ్రామంలో జరిగింది. పోలీసులు కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన పెద్ది కిష్టస్వామి(60) తరచూ మద్యం తాగుతూ భార్యతో గొడవ పడుతుండేవాడు.ఈ క్రమంలో భార్య మద్యం తాగితే ఇల్లు ఎలా గడవాలి అని అడిగింది. దీంతో మద్యం మత్తులో పురుగుమందు తాగాడు. గమనించిన స్థానికులు దవాఖానాకి తరలించగా పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ మృతి చెందాడు.

Similar News

News March 24, 2026

కాసేపట్లో వర్షం..

image

TG: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కాసేపట్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ నిపుణులు అంచనా వేశారు. సిరిసిల్ల, కామారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో రాబోయే 2-3 గంటల్లో ఉరుములతో కూడిన వానలు పడతాయని తెలిపారు. అటు హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి, కుత్బుల్లాపూర్ ఏరియాల్లో రాబోయే 1-2 గంటల్లో వర్షం పడుతుందని పేర్కొన్నారు. మిగతా ఏరియాల్లో పొడి వాతావరణం ఉంటుందని వివరించారు.

News March 24, 2026

కొవ్వూరు: విద్యుత్ తీగలపైనే కాంట్రాక్ట్ ఉద్యోగి మృతి

image

కొవ్వూరు సమీపంలోని నందమూరులో విద్యుత్ పనులు చేస్తూ శ్రీకాంత్ అనే కాంట్రాక్ట్ కార్మికుడు మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. మరమ్మతులు జరుగుతుండగానే విద్యుత్ సరఫరా ఇవ్వడంతో ఆయన తీగలపైనే ప్రాణాలు కోల్పోయారు. రెగ్యులర్ ఉద్యోగులకు బదులు కాంట్రాక్ట్ సిబ్బందిని ప్రమాదకర పనులకు పంపడమే ఈ ఘోరానికి కారణమని తోటి కార్మికులు ఆరోపిస్తున్నారు.

News March 24, 2026

కొవ్వూరు: విద్యుత్ తీగలపైనే కాంట్రాక్ట్ ఉద్యోగి మృతి

image

కొవ్వూరు సమీపంలోని నందమూరులో విద్యుత్ పనులు చేస్తూ శ్రీకాంత్ అనే కాంట్రాక్ట్ కార్మికుడు మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. మరమ్మతులు జరుగుతుండగానే విద్యుత్ సరఫరా ఇవ్వడంతో ఆయన తీగలపైనే ప్రాణాలు కోల్పోయారు. రెగ్యులర్ ఉద్యోగులకు బదులు కాంట్రాక్ట్ సిబ్బందిని ప్రమాదకర పనులకు పంపడమే ఈ ఘోరానికి కారణమని తోటి కార్మికులు ఆరోపిస్తున్నారు.