News March 6, 2025

ములుగు: మావోయిస్టు కొరియర్ల వివివరాలు

image

వెంకటాపురం మండలం కొత్తపల్లి క్రాస్ వద్ద నలుగురు మావోయిస్టు కొరియర్లను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఏటూరునాగారం ఏఎస్పీ శివం ఉపాధ్యాయ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. బాడిసే అనిల్, కుర్హమి భామన్, మాడవి సుక్కు, సోడి ఇడుమల@చారి వీరంతా ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాకు చెందినవారన్నారు. మావోయిస్టు పార్టీకి దుస్తులు, ఎలక్ట్రానిక్ వస్తువులు, బూట్లు అందజేస్తున్నట్లు విచారణలో వెల్లడైందన్నారు.

Similar News

News January 8, 2026

HYDలో ఇళ్లు కట్టుకునేవారికి గుడ్‌న్యూస్

image

ఇల్లు కట్టుకున్నాక ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ లేక కరెంట్, నీళ్ల కనెక్షన్ల కోసం ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారా? ఇక ఆ కష్టాలకు చెక్! పర్మిషన్ గడువు ముగిసినా, ప్లాన్ ప్రకారమే కట్టిన నాన్ హైరైజ్ భవనాలకు ఓసీ ఇచ్చేందుకు జీహెచ్‌ఎంసీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గడువు దాటిన రెండేళ్లలోపు అప్లై చేస్తే పాత ఫీజులే, ఆ పైన అయితే కొత్త రేట్ల ప్రకారం ఛార్జీలు కట్టి సర్టిఫికెట్ పొందవచ్చు.
SHARE IT

News January 8, 2026

WNP: బాల్ బ్యాడ్మింటన్ జిల్లా అధ్యక్షుడిగా మన్మోహన్ రావు

image

ఉమ్మడి మహబూబ్​నగర్ జిల్లా బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షుడిగా వనపర్తికి చెందిన ప్రముఖ న్యాయవాది పి.మన్మోహన్ రావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రధాన కార్యదర్శిగా పి.వెంకట్రాంరెడ్డి ఎన్నికయ్యారు. ముఖ్య అతిథిగా బాల్ బ్యాట్మెంటిన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమణ, పరిశీలకుడిగా సుమన్ హాజరయ్యారు. డిప్యూటీ ఎస్ ఓ.సుధీర్ రెడ్డి, క్రీడాకారులు భాస్కర్ గౌడ్,అలీమ్, చుక్క చంద్ర శేఖర్, నరేందర్ పాల్గొన్నారు.

News January 8, 2026

ఒంటిమిట్ట: అమ్మమ్మను కత్తితో పొడిచాడు..!

image

ఒంటిమిట్ట మండలం నరసన్నగారిపల్లిలో కత్తిపోట్లు కలకలం రేపాయి. స్థానికుల వివరాల మేరకు.. గ్రామానికి చెందిన రాఘవమ్మ(70) పొలంలో పనిచేస్తుండగా ఆమె మనవడు నంద(20) కత్తితో పొడిచాడు. వెంటనే స్థానికులు గమనించి ఆమెను 108లో కడప రిమ్స్‌కు తరలించారు. మద్యానికి డబ్బులు ఇవ్వకపోతేనే దాడి చేసినట్లు సమాచారం. నంద తల్లి కువైట్‌లో ఉండగా.. ప్రస్తుతం అతను అమ్మమ్మ రాఘవమ్మ దగ్గర ఉంటున్నాడు.