News March 6, 2025
సంగారెడ్డి: మౌలిక వసతులు కల్పించండి: కలెక్టర్

జిల్లాలోని మోడల్ స్కూల్లలో మౌలిక వసతులు కల్పించేందుకు అధికారులు కృషి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. కలెక్టరేట్ మినీ సమావేశ మందిరంలో అధికారులతో బుధవారం సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. పీఎంశ్రీ నిధులను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని సూచించారు. సమావేశంలో ట్రైనీ కలెక్టర్ మనోజ్, డీఈఓ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
Similar News
News July 7, 2025
20 నుంచి కడపలో రక్తదాన శిబిరాలు

రక్తదానం చేస్తే మరొకరికి ప్రాణ పోయవచ్చని బీజేపీ కడప జిల్లా అధ్యక్షుడు వెంకట సుబ్బారెడ్డి పేర్కొన్నారు. నెహ్రూ యువ కేంద్రం, మై భారత్ ఆధ్వర్యంలో రక్తదాన పోస్టర్లను ఆయన ఆవిష్కరించారు. కడపలోని రెడ్క్రాస్ కార్యాలయం, రిమ్స్ ఆసుపత్రి, ప్రభుత్వ కాలేజీ ప్రాంగణాల్లో జులై 20 నుంచి 26వ తేదీ వరకు రక్తదాన శిబిరాలు జరుగుతాయన్నారు. ఆసక్తి ఉన్నవారు రక్తదానం చేయాలని కోరారు.
News July 7, 2025
ఇవాళ టారిఫ్ లెటర్స్ పంపిస్తాం: ట్రంప్

వివిధ దేశాలకు తాము ఇవాళ మ.12 గంటలకు (9:30 PM IST) టారిఫ్ లెటర్స్ పంపనున్నట్లు అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ ప్రకటించారు. BRICS అమెరికన్ వ్యతిరేక విధానాలకు మద్దతు తెలిపే ఏ దేశానికైనా అదనంగా 10% సుంకం విధిస్తామని హెచ్చరించారు. ఇందులో ఎలాంటి మినహాయింపులు ఉండవని తెలిపారు. ఈ కొత్త టారిఫ్స్ ఆగస్టు 1 నుంచి అమల్లోకి వస్తాయని US కామర్స్ సెక్రటరీ హోవార్డ్ లుత్నిక్ పేర్కొన్నారు.
News July 7, 2025
WGL: లోకల్ పంచాయితీ తెగేనా..!

స్థానిక సంస్థల ఎన్నికలను సెప్టెంబరు 30లోగా నిర్వహించాలని హైకోర్టు ఎన్నికల సంఘాన్ని ఆదేశించిన విషయం తెలిసిందే. అయితే BC రిజర్వేషన్ 42% అమలు అంశం గ్రామాల్లో కాక పుట్టిస్తోంది. మరో నెలన్నర లోపల ఎన్నికలు వస్తాయంటూ ఉమ్మడి జిల్లాలోని 1,702 పంచాయతీలు, 775 MPTC, 75 ZPTCల స్థానాల కోసం ఆశావహులు ఎదురుచూస్తున్నారు. పార్లమెంట్ ఆమోదిస్తేనే రిజర్వేషన్లు సాధ్యమవుతాయని రాష్ట్ర ప్రభుత్వం తర్జన భర్జన పడుతోంది.