News March 6, 2025

ఆందోలు: ఉద్యోగులు సమయపాలన పాటించాలి: మంత్రి

image

వైద్య శాఖలో పనిచేస్తున్న ప్రతి ఉద్యోగి సమయపాలన పాటించాలని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ బుధవారం తెలిపారు. ఆయన మాట్లాడుతూ ఆశా వర్కర్ మొదలుకొని డాక్టర్ వరకు ప్రతి ఒక్కరు సమయానికి విధులు నిర్వహించాలని చెప్పారు. సమయపాలన పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లాలోని అన్ని ఆసుపత్రులను తాను తనిఖీ చేస్తానని పేర్కొన్నారు.

Similar News

News March 13, 2026

NTR: హైకోర్టు లాయర్‌పై దాడి కేసులో కీలక మలుపు

image

విజయవాడకు చెందిన హైకోర్టు న్యాయవాదిపై 2023లో జరిగిన దాడి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఏ-1 నిందితుడు కర్నాటి వీరభద్రరావును పటమట పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. నిందితుడికి న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించినట్లు సీఐ పవన్ కిషోర్ తెలిపారు. ఈ ఘటనలో ప్రమేయం ఉన్న మరో ఇద్దరి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

News March 13, 2026

వారసత్వ స్థలాలకు సెల్ఫ్ డిక్లరేషన్ చాలు!

image

AP: వారసత్వంగా లభించే వ్యవసాయేతర స్థలాల రిజిస్ట్రేషన్లపై ప్రభుత్వం నూతన మార్గదర్శకాలు విడుదల చేసింది. ఇకపై గ్రామాల్లోని ఇలాంటి స్థలాల రిజిస్ట్రేషన్‌కు రెవెన్యూ శాఖ సర్టిఫికెట్ అవసరం లేదు. యజమానుల సెల్ఫ్ డిక్లరేషన్ సరిపోతుంది. తమకు పూర్వీకుల నుంచే ఆస్తి వచ్చిందని, నిషేధిత జాబితా(22A)లో లేదని, తామే పూర్తి హక్కుదారు అని అందులో స్పష్టంగా పేర్కొనాలి. తప్పుడు సమాచారం ఇస్తే చర్యలు తప్పవు.

News March 13, 2026

నిజామాబాద్: ఘోర ప్రమాదం.. నలుగురి మృతి

image

ఇందల్వాయి మండలం గన్నారం 44వ జాతీయ రహదారిపై శుక్రవారం తెల్లవారుజామున ప్రైవేటు ట్రావెల్స్ బస్సు బోల్తా కొట్టింది. హైదరాబాద్ నుంచి 22 మంది ప్రయాణికులతో అకోలా (మహారాష్ట్ర) వెళుత్తున్న బస్సు ఇందల్వాయి వద్ద అదుపుతప్పి బోల్తా పడింది. నలుగురు ప్రయాణికులు ఘటనా స్థలంలోనే మృతి చెందగా, క్షతగాత్రులను చికిత్స నిమిత్తం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇందల్వాయి పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు.