News March 6, 2025

మహిళా శక్తి పథకం గ్రౌండింగ్ పనులను పూర్తి చేయండి

image

ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఇందిరా మహిళా శక్తి కార్యక్రమంలోని 16 రకాల యూనిట్ల గ్రౌండింగ్‌ వంద శాతం పూర్తి చేసి లక్ష్యాలను సాధించాలని వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి ఆదేశించారు. బుధవారం కలెక్టర్ ఛాంబర్లో జిల్లా గ్రామీణభివృద్ధి శాఖ అధికారులతో మహిళా శక్తి పథకం యూనిట్ల లక్ష్యం, బ్యాంక్ లింకేజీ రుణాలు తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు. మహిళలని ఆర్థికంగా బలోపేతం చేయడమే దీని ఉద్దేశమన్నారు.

Similar News

News November 13, 2025

HYD: బిజీ లైఫ్ వల్ల బ్రెయిన్‌పై ఎఫెక్ట్!

image

HYDలో అధిక రక్తపోటు, మధుమేహం, కొలెస్ట్రాల్, నిద్రలేమి, పొగతాగడం, మద్యపానం, శారీరక శ్రమ లేకపోవడం, తీవ్రమైన ఒత్తిడి, ఆందోళన కారణంగా మెదడుపై తీవ్రంగా ప్రభావం పడుతున్నట్లుగా సీనియర్ న్యూరో సర్జన్ వంశీకృష్ణ తెలిపారు. HYDలో NIMS ఆసుపత్రికి నెలకు 250 నుంచి 300 కేసులు వస్తున్నట్లుగా తెలిపారు. ఈ నేపథ్యంలో ఉరుకుల పరుగుల జీవితంలో ప్రశాంతత, యోగా, ధ్యానం, ప్రకృతితో గడపడం లాంటివి చేయాలని సూచించారు.
SHARE IT

News November 13, 2025

కడప కేంద్ర కారాగారంలో జీవిత ఖైదీ మృతి

image

కడప కేంద్ర కారాగారంలో ఉన్న జీవిత ఖైదీ గురువారం గుండెపోటుతో మృతి చెందాడు. కడప సెంట్రల్ జైల్లో జీవిత ఖైదీగా శిక్ష అనుభవిస్తున్న నంద్యాల జిల్లా కోవెలకుంట్ల మండలం భీమునిపాడుకు చెందిన చిన్న సుంకిరెడ్డికి ఇవాళ ఉదయం గుండెపోటు వచ్చింది. దీంతో కడప రిమ్స్‌కు తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారని జైలు అధికారులు వెల్లడించారు.

News November 13, 2025

పార్ట్నర్‌షిప్ రౌండ్ టేబుల్ సమావేశంలో CM చంద్రబాబు

image

విశాఖలో CII సుమ్మిట్‌లో భాగంగా గురువారం ఇండియా-యూరప్ బిజినెస్ పార్ట్నర్‌షిప్ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. CM చంద్రబాబు వేర్వేరు కంపెనీల ఛైర్మన్లు, సీఈవోలతో సమావేశమయ్యారు. విశాఖ అద్భుతమైన సాగర తీర నగరం అని, ఇక్కడ మంచి వనరులు ఉన్నాయన్నారు. ఏపీలో పెద్దఎత్తున పోర్టులను నిర్మిస్తున్నామని, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనే విధానాన్ని అమలు చేసి యుద్ధ ప్రాతిపదికన అనుమతులు ఇస్తున్నట్లు CM పేర్కొన్నారు.