News March 6, 2025
ముదినేపల్లి: ఎలుకల మందు తిని యువకుడు ఆత్మహత్య

ముదినేపల్లి మండలం వడాలికి చెందిన కటికల నాగరాజు (17) ఎలుకల మందు తిని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. మంగళవారం రాత్రి ఇంటి వద్ద ఎలుకల మందు తిని అపస్మారకస్థితిలోకి వెళ్లడంతో సానికులు ఆసుపత్రికి తరలించారు. విఆర్వో పద్మ పంచనామా నిర్వహించారు. పోస్టుమార్టం అనంతరం గుడివాడ గవర్నమెంట్ హాస్పిటల్లో మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. మృతికి ప్రేమ, తల్లి మందలించడమా అనే కారణాలు తెలియాల్సి ఉంది.
Similar News
News March 3, 2026
నేడే చంద్రగ్రహణం.. ఎప్పుడు చూడొచ్చంటే?

ఈరోజు సంపూర్ణ చంద్రగ్రహణం మధ్యాహ్నం 3.20 గంటలకు ప్రారంభం కానుంది. అయితే మన దేశంలో ఈ గ్రహణం చివరి దశలో ఉన్నప్పుడే కనిపిస్తుంది. తెలుగు రాష్ట్రాలవారు సాయంత్రం 6.20 నుంచి 6.47 వరకు గ్రహణాన్ని చూడొచ్చు. కాగా గ్రహణం సందర్భంగా ఈరోజు ప్రధాన ఆలయాలు అన్ని మూతపడతాయి. ఇక భారత్ సహా ఈ సంపూర్ణ చంద్రగ్రహణం తూర్పు ఆసియా, ఆస్ట్రేలియా, అమెరికాలోనూ కనిపిస్తుంది.
News March 3, 2026
చిత్తూరు జిల్లాలో వారికి వారం రోజుల గడువు

గుర్తింపు పొందని ప్రైవేటు ఆసుపత్రులు, వివిధ క్లినిక్లకు చిత్తూరు DMHO సుధారాణి కీలక సూచనలు చేశారు. APMCE చట్టం ప్రకారం అనుమతి పొందేలా వారం రోజుల్లో దరఖాస్తులు చేసుకోవాలనన్నారు. చట్టాన్ని ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇంకా గుర్తింపు పొందని ప్రైవేటు ఆసుపత్రులు, క్లినిక్లు, ఫిజియోథెరపీ యూనిట్లు డీఎంహెచ్వో వద్ద రిజిస్ట్రేషన్కు దరఖాస్తు చేసుకోవాలన్నారు.
News March 3, 2026
పాలమూరు: ఇందిరమ్మ ఇల్లు నిర్మిస్తుండగా ప్రమాదం

జడ్చర్ల మండలం తుప్పడగడ్డతండాలో విషాదం చోటుచేసుకుంది. ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి ఇసుక తెస్తున్న రాజేష్ (29) ట్రాక్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. వాగు నుంచి ఇసుకను తరలిస్తుండగా ట్రాక్టర్ ఒక్కసారిగా గుంతలోకి దిగడంతో రాజేష్ అదుపుతప్పి కింద పడటంతో దూసుకెళ్లింది. ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేశారు.


