News March 6, 2025

PPM: ‘జిల్లాలో రూ.2.47 కోట్లు రాయితీపై వ్యవసాయ పరికరాలు’

image

రాష్ట్ర ప్రభుత్వం 2024-25 సంవత్సరానికి సంబంధించి రైతులకు 50% వరకు రాయితీపై వ్యవసాయ పరికరాలను అందించుటకు నిర్ణయించడమైందని జిల్లా వ్యవసాయ అధికారి రాబర్ట్ పాల్ తెలిపారు. మన్యం జిల్లాలో రూ.2.47 కోట్లు రాయితీపై వ్యవసాయ పరికరాలను అందించనుందన్నారు. బ్యాటరీ స్పెయర్లు, ఫుట్ స్పియర్స్, తైవాన్ స్పేయర్స్, ట్రాక్టర్ దుక్కి, దమ్ము సెట్లు, రోటోవేటర్లు, పవర్ వీడర్లు,పవర్ టిల్లర్లు రాయితీపై అందించబడతాయని తెలిపారు.

Similar News

News December 25, 2025

గద్దెల విస్తరణ పనులు త్వరగా పూర్తి చేయాలి: మంత్రి సీతక్క

image

మేడారం వనదేవతల గద్దెల విస్తరణ పనులు మరింత వేగం పెరగాలని, అవసరమైతే సిబ్బందిని పెంచి 24 గంటల్లో పనులు జరిపించాలని అధికారులను మంత్రి సీతక్క ఆదేశించారు. జంపన్న వాగు స్నాన ఘట్టాలు, పార్కింగ్ స్థలాలు, రోడ్ల పనులను పరిశీలించిన మంత్రి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కొంగల మడుగు నుంచి జంపన్నవాగుకు వెళ్లే రోడ్డును మరమ్మతు చేయాలన్నారు. పారిశుద్ధ్య పనులను ఎప్పటికప్పుడు చేపట్టాలని సూచించారు.

News December 25, 2025

క్రిస్మస్ వేడుకల్లో రోజా

image

చిత్తూరు జిల్లా వ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. నగరి మున్సిపాలిటీ నత్తంకండ్రికలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో మాజీ మంత్రి రోజా పాల్గొన్నారు. అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్పారు. వైసీపీ నాయకులతో కలిసి కేక్ కట్ చేశారు. చిన్నారులకు కేక్ తినిపించారు. యేసు ప్రభువు సూచించిన మార్గంలో అందరూ నడవాలని రోజా సూచించారు.

News December 25, 2025

NGKL: గురుకులాల్లో ప్రవేశాలకు ఆహ్వానం: కలెక్టర్

image

జిల్లాలో 2026-27 విద్యా సంవత్సరానికి గాను గురుకుల పాఠశాలలో ప్రవేశాల కోసం దరఖాస్తులు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సాంఘిక, గిరిజన, వెనుకబడిన, మైనార్టీ గురుకుల పాఠశాలలో 5వ తరగతి నుంచి 9వ తరగతి వరకు ప్రవేశాల కోసం ఉమ్మడి ప్రవేశాల కోసం దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు.