News March 6, 2025
జగిత్యాల: మిల్లర్లు సీఎంఆర్ బకాయిలు చెల్లించాలి: అడిషనల్ కలెక్టర్

ఈనెల 17 లోగా రైస్ మిల్లర్లు సీఎంఆర్ బకాయిలు చెల్లించాలని అడిషనల్ కలెక్టర్ బీఎస్ లత ఆదేశించారు. జగిత్యాల కలెక్టరేట్లో యాసంగి 2023-24 కు సంబంధించి సీఎంఆర్ చెల్లింపులపై బాయిల్డ్ రైస్ మిల్లర్లతో బుధవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడారు. బకాయిలు చెల్లించకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు. సమావేశంలో జిల్లా పౌరసరఫరాల అధికారి, మేనేజర్, రైస్ మిల్లర్లు తదితరులు పాల్గొన్నారు.
Similar News
News March 21, 2026
8 గంటల ప్రయాణం తర్వాత విమానం యూటర్న్!

ఢిల్లీ నుంచి వాంకోవర్(కెనడా)కు బయల్దేరిన ఎయిరిండియా విమానం ప్రయాణికులకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. 8Hr ప్రయాణం తర్వాత తిరిగి ఢిల్లీలోనే ల్యాండైంది. కెనడాలో ఆ ఫ్లైట్కు పర్మిషన్ లేకపోవడమే ఇందుకు కారణం. ఎయిరిండియాకు చెందిన బోయింగ్ 777-300ER విమానాలకు కెనడాలో అనుమతి ఉండగా, 777-200LRను పంపింది. చైనా గగనతలంలోకి వెళ్లాక తెలియడంతో అధికారులు వెనక్కి రప్పించారు. తర్వాత వేరే విమానంలో ప్రయాణికులను పంపారు.
News March 21, 2026
దేశాన్ని అమ్మేశారు.. కేంద్రంపై మమత ఫైర్

ఇంధన ధరలు పెంచాలని కేంద్రం ప్లాన్ చేస్తోందని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు. దేశాన్ని అమ్మేశారని మండిపడ్డారు. ‘మన్మోహన్ హయాంలో గ్యాస్ సిలిండర్ ధర రూ.400 ఉండేది. ఇప్పుడు రూ.1,100 చేశారు. రానున్న రోజుల్లో మరింతగా పెరుగుతాయి’ అని చెప్పారు. మరోవైపు బెంగాల్లో అప్రకటిత రాష్ట్రపతి పాలన నడుస్తోందని ఫైరయ్యారు. ప్రధాని మోదీ నుంచి దేశాన్ని కాపాడటమే తనకు ప్రాధాన్యమని అన్నారు.
News March 21, 2026
సంగారెడ్డి: టెన్త్ పరీక్షలు పారదర్శకంగా నిర్వహించాలి: కలెక్టర్

జిల్లాలో పదవ తరగతి పరీక్షలు పారదర్శకంగా జరిగేలా చూడాలని కలెక్టర్ ప్రావీణ్య ఆదేశించారు. సంగారెడ్డి క్యాంపు కార్యాలయంలో ఎంఈఓలతో వీడియో కాన్ఫరెన్స్ శుక్రవారం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. పరీక్ష కేంద్రాల్లోకి మొబైల్ ఫోన్స్ అనుమతి లేదని చెప్పారు. పరీక్షా కేంద్రంలో ఏ ఘటన జరిగిన చీఫ్ సూపరింటెండ్లు, ఎంఈవో లే బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పారు. డీఈఓ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.


