News March 6, 2025
జగిత్యాల: మిల్లర్లు సీఎంఆర్ బకాయిలు చెల్లించాలి: అడిషనల్ కలెక్టర్

ఈనెల 17 లోగా రైస్ మిల్లర్లు సీఎంఆర్ బకాయిలు చెల్లించాలని అడిషనల్ కలెక్టర్ బీఎస్ లత ఆదేశించారు. జగిత్యాల కలెక్టరేట్లో యాసంగి 2023-24 కు సంబంధించి సీఎంఆర్ చెల్లింపులపై బాయిల్డ్ రైస్ మిల్లర్లతో బుధవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడారు. బకాయిలు చెల్లించకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు. సమావేశంలో జిల్లా పౌరసరఫరాల అధికారి, మేనేజర్, రైస్ మిల్లర్లు తదితరులు పాల్గొన్నారు.
Similar News
News November 6, 2025
BBL: ఆ బంతులు ప్రేక్షకులకే!

ఆస్ట్రేలియాలో జరిగే BBL, WBBL టోర్నీల్లో కొత్త రూల్స్ అమల్లోకి రానున్నాయి. బ్యాటర్ 6 లేదా 4 కొట్టిన బంతి ప్రేక్షకుల వద్దకు వెళితే దాన్ని వాళ్లు తీసుకెళ్లొచ్చు. అయితే ఇన్నింగ్స్ ఫస్ట్ ఓవర్కే ఇది వర్తిస్తుంది. ఆ ఓవర్లో ఎన్నిసార్లు కొట్టినా సరే బంతిని మారుస్తారు. మరోవైపు బాల్ను ప్రేక్షకులు తీసుకోకపోయినా రెండో ఓవర్ నుంచి కొత్తది వాడనున్నారు. ఆలస్యం జరగకుండా అంపైర్లు తమ వద్ద కొన్ని ఉంచుకోనున్నారు.
News November 6, 2025
ఊట్కూర్: నేల మట్టమైన వరి పంట

ఇటీవల తుఫాను ప్రభావంతో కురిసిన భారీ వర్షాలు, బలమైన ఈదురు గాలుల కారణంగా ఊట్కూరు మండల కేంద్రంలోని పెద్ద జెట్రం అమ్మనికి చెందిన రైతుల పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. శివారులో వేసిన వరి పొలాలు నీట మునిగి సుమారు 50 ఎకరాల వరి పంట నష్టం చేతికొచ్చిన పంటలు నీటి పాలవడంతో అన్నదాతలు తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు. పంట నష్టాన్ని అధికారులు వెంటనే అంచనా వేసి రైతులను ఆదుకోవాలని మాజీ MPTC కిరణ్ డిమాండ్ చేశారు.
News November 6, 2025
IMMTలో 30 ఉద్యోగాలు.. దరఖాస్తు గడువు పొడిగింపు

CSIR-ఇన్స్టిట్యూట్ ఆఫ్ మినరల్స్ అండ్ మెటీరియల్స్ టెక్నాలజీ(<


