News March 6, 2025

నిజామాబాద్: MLC కౌంటింగ్.. 60 గంటలు సాగింది..!

image

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో BJP అభ్యర్థి అంజిరెడ్డి గెలుపొందిన సంగతి తెలిసిందే. కాగా కౌంటింగ్ ప్రక్రియ సుదీర్ఘంగా సాగింది. ఈనెల 3న ఉ. 8 గంటలకు చెల్లుబాటయ్యే ఓట్లు, చెల్లుబాటు కాని ఓట్లను వేరు చేయడం మెుదలు పెట్టగా మంగళవారం ఉ. 10 గంటల వరకు ఈ ప్రక్రియ సాగింది. 11 గంటలకు అభ్యర్థులకు పోలైన ఫస్ట్ ప్రయార్టీ ఓట్ల లెక్కింపు స్టార్ట్ చేయగా బుధవారం 8 గంటలకు అంటే సుమారు 60 గంటల వరకు సాగింది.

Similar News

News November 11, 2025

ఆత్మహత్య ఘటనలో ఇద్దరికి రిమాండ్: ఎస్ఐ

image

నందిగం మండలం తురకలకోట గ్రామానికి చెందిన ఎం.వెంకటరావు(34) అనే వ్యక్తి శనివారం ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. ఈ మేరకు నందిగం పోలీసులు కేసు నమోదు చేశారు. వెంకటరావును వేధించిన పెట్రోల్ బంక్ యజమాని బీ.రమేశ్‌తో పాటు అతనికి సహకరించిన ఒక హెడ్ కానిస్టేబుల్ ఇరువురుని ఆదివారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు నందిగం ఎస్ఐ షేక్ మహమ్మద్ అలీ తెలిపారు.

News November 11, 2025

వికారాబాద్: కల్లు దుకాణాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారా.?

image

వికారాబాద్ జిల్లాలో కల్లు దుకాణాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని జిల్లా SP నారాయణ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ప్రతి పోలీస్ స్టేషన్‌లో సమావేశం ఏర్పాటు చేసి SHOలు షాపు యజమానులకు సూచించారు. అయితే ఇప్పటి వరకు పలు దుకాణాల వద్ద కెమెరాలు ఏర్పాటు చేయలేకపోయారు. SP ఆదేశాలను బేఖాతర్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికైనా చొరవ తీసుకొని ఏర్పాటు చేయాలని పలువురు కోరుతున్నారు.

News November 11, 2025

చిత్తూరు: విస్తృతంగా పోలీసుల తనిఖీ

image

ఢిల్లీలో జరిగిన దాడుల నేపథ్యంలో చిత్తూరు జిల్లా పోలీసు శాఖ అప్రమత్తమైంది. జిల్లా ఎస్పీ తుషార్ డూడీ ఆదేశాల మేరకు జిల్లా అంతటా అన్ని ముఖ్యమైన రహదారులు, చెక్‌పోస్టులు, రైల్వే స్టేషన్లు, బస్ స్టాండ్లు పట్టణ ప్రవేశ ద్వారాల వద్ద విస్తృత స్థాయిలో వాహన తనిఖీలు చేపట్టారు. లాడ్జిలు, హోటళ్లలో సైతం తనిఖీలు చేశారు. అనుమానితులపై పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.