News March 6, 2025

అనకాపల్లి: చీమల మందు తాగిన అంగన్వాడీ కార్యకర్త

image

కె.కోటపాడు మండలం పోతనవలస అంగన్వాడీ కార్యకర్త రొంగలి నూకరత్నం గురువారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఐసీడీఎస్ సీడీపీఓ, సూపర్వైజర్ వేధింపులు తాళలేక ఆత్మహత్యయత్నానికి పాల్పడినట్లు సీఐటీయూ నాయకులు ఆరోపించారు. ప్రస్తుతం ఆమె కె.కోటపాడు సి.హెచ్.సిలో చికిత్స పొందుతుంది. తనిఖీల పేరుతో వేధింపులకు గురి చేయడంతోనే నూకరత్నం చీమల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందని, సీఐటీయూ నాయకులు తెలిపారు.

Similar News

News March 5, 2026

సిరిసిల్ల జిల్లాలో నలుగురు సీఐల బదిలీ

image

సిరిసిల్ల జిల్లాలో పలువురు సీఐలు బదిలీ చేస్తూ మల్టీ జోన్ ఐజీ చంద్రశేఖర్ రెడ్డి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. కరీంనగర్ పీసీఆర్‌లో పనిచేస్తున్న ఓదెల వెంకటేశ్ ఎల్లారెడ్డిపేటకు, అక్కడ పనిచేస్తున్న శ్రీనివాస్ గౌడ్ ఐజీపీ హైదరాబాద్‌కు బదిలీ అయ్యారు. డీసీఆర్బీగా పనిచేస్తున్న నాగేశ్వరరావు సిరిసిల్ల రూరల్ సర్కిల్‌కు బదిలీ కాగా, అక్కడ విధులు నిర్వహిస్తున్న మొగిలి సిరిసిల్ల డీసీఆర్బీకి బదిలీ అయ్యారు.

News March 5, 2026

ఈనెల 10న అమలాపురంలో జాబ్ మేళా

image

అమలాపురం: పట్టణంలోని జిల్లా ఉపాధి కార్యాలయం వద్ద ఈనెల 10న ఉదయం 10:30 గంటలకు జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారి జి. శ్రీనివాసరావు తెలిపారు. ప్రముఖ సంస్థలలో వివిధ ఉద్యోగాలకు SSC, ఇంటర్, డిగ్రీ, ITI, డిప్లొమా ఉత్తీర్ణులైన వారు అర్హులని పేర్కొన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు తమ ధృవపత్రాలతో హాజరుకావాలని, మరిన్ని వివరాలకు కార్యాలయంలో సంప్రదించాలని కోరారు.

News March 5, 2026

పెద్దపల్లి: ప్రతి పౌరుడికి ఆధార్ అందేలా చర్యలు: కలెక్టర్

image

జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష సమీకృత జిల్లా కలెక్టరేట్‌లో గురువారం ఆధార్ అప్‌డేట్ సమీక్ష నిర్వహించారు. ప్రతి పౌరుడికి ఆధార్ కార్డు అందేలా చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాల విద్యార్థులకు ఆధార్ తప్పనిసరి అని కలెక్టర్ తెలిపారు. ఇప్పటికే ఉన్న ఆధార్ కార్డులు సమయానికి అప్‌డేట్ చేయాలని, ప్రత్యేక డ్రైవ్‌ల ద్వారా పాఠశాలల్లో విద్యార్థులకు ఆధార్ అందించడానికి పర్యటనలు నిర్వహించాలని సూచించారు.