News March 6, 2025
బస్సును ఓవర్ టేక్ చేయబోయి యువకుడి దుర్మరణం

నంద్యాల జిల్లా ఆత్మకూరులో బుధవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో సతీశ్ అనే యువకుడు దుర్మరణం చెందాడు. పట్టణంలోని గొల్లపేటకు చెందిన సతీశ్.. ఓ ప్రైవేట్ సంస్థలో కొరియర్ బాయ్గా పనిచేస్తున్నాడు. బుధవారం ఆత్మకూరులోని కేజీ రోడ్డుపై వెళ్తుండగా ఎదురుగా వెళ్తున్న ఆర్టీసీ బస్సును ఓవర్టేక్ చేసే క్రమంలో వెనక వస్తున్న బొలెరో వాహనం తగిలింది. తీవ్రంగా గాయపడిన సతీశ్.. చికిత్స పొందుతూ మృతి చెందాడు.
Similar News
News March 21, 2026
రంజాన్.. కర్నూలులో ట్రాఫిక్ మళ్లింపు

రంజాన్ పండుగను పురస్కరించుకుని శనివారం ఉదయం 6 గంటల నుంచి ప్రార్థనలు ముగిసేవరకు నగరంలో ట్రాఫిక్ మళ్లింపు అమలు చేస్తామని ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. హైదరాబాద్ నుంచి వచ్చే ఆర్టీసీ బస్సులను టౌన్లోకి అనుమతించకుండా తిప్పమ్మకొట్టం వద్ద నుంచి నేషనల్ హైవేపైకి మళ్లిస్తారు. బస్టాండ్ నుంచి బయలుదేరే బస్సులను బళ్లారి చౌరస్తా, బిర్లా జంక్షన్, సీ. క్యాంపు నుంచి నంద్యాల వైపు మళ్ళిస్తున్నట్లు తెలిపారు.
News March 21, 2026
నిర్దేశించిన లక్ష్యానికి రెట్టింపు లక్ష్యం చేరుకోవాలి: కలెక్టర్

జిల్లాలో 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన గ్రాస్ డిస్ట్రిక్ట్ డోమెస్టిక్ ప్రోడక్ట్ లక్ష్యాలను అదిగమించాలని కలెక్టర్ డా. ఏ. సిరి జిల్లా అధికారులను ఆదేశించారు. శుక్రవారం కర్నూలు కలెక్టరేట్లో జీడీడీపీపై అధికారులతో సమావేశాన్ని నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన లక్ష్యమే కాకుండా ఆ లక్ష్యానికి రెట్టింపుగా లక్ష్యం నిర్దేశించుకుని సాధించాలన్నారు.
News March 21, 2026
నిర్దేశించిన లక్ష్యానికి రెట్టింపు లక్ష్యం చేరుకోవాలి: కలెక్టర్

జిల్లాలో 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన గ్రాస్ డిస్ట్రిక్ట్ డోమెస్టిక్ ప్రోడక్ట్ లక్ష్యాలను అదిగమించాలని కలెక్టర్ డా. ఏ. సిరి జిల్లా అధికారులను ఆదేశించారు. శుక్రవారం కర్నూలు కలెక్టరేట్లో జీడీడీపీపై అధికారులతో సమావేశాన్ని నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన లక్ష్యమే కాకుండా ఆ లక్ష్యానికి రెట్టింపుగా లక్ష్యం నిర్దేశించుకుని సాధించాలన్నారు.


