News March 22, 2024
మిగతా నగరాలకూ బెంగళూరు పరిస్థితేనా?
తగిన చర్యలు తీసుకోకుంటే ఇతర ప్రాంతాలకూ బెంగళూరు తరహాలో నీటి ఎద్దడి తప్పవంటున్నారు నిపుణులు. ప్రస్తుతం దేశంలోని 150 ప్రధాన రిజర్వాయర్లలో నీటి నిల్వలు 38% మాత్రమే ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. కర్ణాటకతో పాటు హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, MP, త్రిపుర, రాజస్థాన్, బిహార్, మహారాష్ట్ర, UP, గుజరాత్, ఛత్తీస్గఢ్, ఏపీ, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల్లో గత ఏడాదితో పోలిస్తే నీటి నిల్వలు తగ్గినట్లు తెలుస్తోంది.
Similar News
News October 2, 2024
ఆలయాల్లో సాయిబాబా విగ్రహాల తొలగింపు
యూపీ వారణాసిలోని పలు ఆలయాల నుంచి సాయిబాబా విగ్రహాలను తొలగించడం వివాదానికి దారితీసింది. ‘సనాతన్ రక్షక్ దళ్’ చేపట్టిన ప్రచారంలో భాగంగా 10 మందిరాల్లో నిన్న బాబా విగ్రహాలను తొలగించి, ఆలయాల బయట పెట్టారు. సరైన పరిజ్ఞానం లేకుండా సాయిబాబాను ఆరాధిస్తున్నామని, శాస్త్రాల్లో ఎక్కడా బాబా ఆరాధన గురించి చెప్పలేదన్నారు. బాబా ధర్మ గురువే కావొచ్చు కానీ దేవుడు కాదని అయోధ్యలోని హనుమాన్ గఢీ ఆలయ మహంతు అభిప్రాయపడ్డారు.
News October 2, 2024
రేపటి నుంచి టెట్
AP: ఈ నెల 3 నుంచి 21 వరకు టెట్-2024 పరీక్షలు జరగనున్నాయి. మొదటి సెషన్ ఉ.9.30 నుంచి మ.12 వరకు, రెండో సెషన్ మ.2.30 నుంచి సా.5 వరకు ఉంటుంది. హాల్ టికెట్లలో తప్పులు ఉంటే సరైన ఆధారాలు చూయించి సెంటర్ దగ్గరున్న నామినల్ రోల్స్లో సరిచేసుకోవాలని అధికారులు సూచించారు. ఇప్పటివరకు హాల్ టికెట్లు తీసుకోని వారు https://aptet.apcfss.in/కు వెళ్లి డౌన్లోడ్ చేసుకోవచ్చన్నారు.
News October 2, 2024
సుప్రీం వ్యాఖ్యలతోనైనా ప్రభుత్వం కళ్లు తెరవాలి: అవినాశ్ రెడ్డి
AP: రాజకీయాల కోసమే తిరుమల లడ్డూ వివాదాన్ని తీసుకొచ్చారని ఎంపీ అవినాశ్ రెడ్డి విమర్శించారు. ‘కల్తీ నెయ్యి వాడలేదని EO ప్రకటించారు. వాడారని చంద్రబాబు అన్నారు. ప్రభుత్వంలోని పెద్దలకే సయోధ్య లేదు. సుప్రీంకోర్టు వ్యాఖ్యలతో అయినా ప్రభుత్వం కళ్లు తెరవాలి. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ గాడి తప్పింది. YCP నాయకులను కేసులతో వేధిస్తున్నారు. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదని గుర్తు పెట్టుకోవాలి’ అని హెచ్చరించారు.