News March 6, 2025
గూడూరు: ‘ఇసుకలో తల ఇరుక్కొని చనిపోయాడు’

MHBD జిల్లా గూడూరు మండలం చిర్రకుంట తండాలో బుధవారం వ్యక్తి మరణించడంతో విషాదం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. చిర్రకుంటతండాకు చెందిన భూక్య రాజ్ కుమార్ తన వ్యవసాయ పంట పొలాల్లో కోతుల బెడద వల్ల ఇబ్బంది పడుతున్నాడు. కాగా, కోతులు ఆవాసం ఏర్పరచుకున్న చెట్టు కొమ్మలను నరికి వేసే క్రమంలో చెట్టు పైనుంచి జారిపడ్డాడు. చెట్టు కింద వాగు ఇసుకలో తల కూరుకుపోయి అక్కడికక్కడే మృతి చెందాడు.
Similar News
News November 18, 2025
పనులు త్వరగా పూర్తి చేయాలి: దీపక్ తివారి

ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలలో మౌలిక వసతుల కల్పన పనులు త్వరగా పూర్తి చేయాలని ASF జిల్లా అదనపు కలెక్టర్ దీపక్ తివారి సూచించారు. మంగళవారం కలెక్టరేట్లో జిల్లా గ్రామీణాభివృద్ధి, మహిళా- శిశు సంక్షేమ, విద్య, పంచాయతీ రాజ్, గిరిజన సంక్షేమ శాఖల అధికారులు, ఇంజినీరింగ్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అంగన్వాడీ భవనాల నిర్మాణాలు, వసతుల కల్పన పనులు త్వరగా పూర్తి చేయాలన్నారు.
News November 18, 2025
స్టూడెంట్ అఫైర్స్ డైరెక్టర్గా డా. కె.అరుణప్రియ

మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం స్టూడెంట్ అఫైర్స్ డైరెక్టర్గా డా కె.అరుణప్రియను నియమిస్తూ రిజిస్ట్రార్ ఆచార్య అల్వాల రవి ఉత్తర్వులు జారీ చేశారు. డా.కె అరుణప్రియ ప్రస్తుతం ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్గా వ్యవహరిస్తున్నారు. ఆమె స్టూడెంట్ అఫైర్స్ డైరెక్టర్గా ఏడాది కాలం పాటు సేవలందించనున్నారు. ఈ సందర్భంగా అరుణప్రియను అధికారులు, విద్యార్థులు అభినందించారు.
News November 18, 2025
HNK: లోన్ యాప్ వేధింపులు.. యువకుడి సూసైడ్

హనుమకొండ టీవీ టవర్ కాలనీకి చెందిన నవీన్ అనే యువకుడు లోన్ యాప్ వేధింపులకు తాళలేక ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చైనాకు చెందిన యాప్లో లోన్ తీసుకొని చెల్లించకపోవడంతో, అతడి ఫొటోలను మార్ఫింగ్ చేసి వాట్సాప్లో పోస్ట్ చేశారు. దీంతో మనస్తాపానికి గురైన నవీన్, వేధింపులు తట్టుకోలేక వడ్డేపల్లి-దేవన్నపేట మధ్యలోని బావిలో దూకి బలవన్మరణం చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు.


