News March 6, 2025

BREAKING.. వరంగల్: కూలీలతో వెళ్తున్న ఆటో బోల్తా.. ఒకరు మృతి

image

వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం కోనాపూరం శివారులో రోడ్డు ప్రమాదం జరిగింది. మిర్చి కూలీలతో వెళ్తున్న వాహనం బోల్తాపడింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. దాదాపు 20 మంది కూలీలకు గాయాలయ్యాయి. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. జీడిగట్టుతండా నుంచి ఇటుకలపల్లి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ప్రమాద సమయంలో ఆటోలో మొత్తం 35 మంది ఉన్నట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News March 6, 2025

వరంగల్ మార్కెట్లో తటస్థంగా పత్తి ధర

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో నిన్నటితో పోలిస్తే ఈరోజు పత్తి ధరలో ఎలాంటి మార్పు లేదు. సోమవారం క్వింటా పత్తి ధర రూ.6,880 పలకగా.. మంగళవారం రూ.6,920 పలికింది. బుధవారం స్వల్పంగా తగ్గి రూ.6,900కి చేరింది. అయితే గురువారం సైతం రూ.6,900 పలికినట్లు మార్కెట్ వ్యాపారులు తెలిపారు. అయితే పత్తి ధరలు పెరగకపోవడంతో రైతన్నలు నిరాశ చెందుతున్నారు.

News March 6, 2025

WGL: 267 మంది ఆబ్సెంట్.. ఒక మాల్ ప్రాక్టీస్ కేస్

image

వరంగల్ జిల్లాలో ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామ్ మొదటి రోజు ప్రశాంతంగా ముగిసినట్లు అధికారులు వెల్లడించారు. మొత్తం వరంగల్ జిల్లాలో 6,266 మొదటిరోజు 5,999 మంది విద్యార్థులు మాత్రమే పరీక్షకు హాజరయ్యారు. 267 మంది విద్యార్థులు ఆబ్సెంట్ అయ్యారు. మొదటి రోజు ఒకరు మాల్ ప్రాక్టీస్ చేస్తే పట్టుపడ్డారు.

News March 6, 2025

నెక్కొండ: యాక్సిడెంట్‌లో 9వ తరగతి విద్యార్థి మృతి

image

నెక్కొండలో జరిగిన యాక్సిడెంట్‌లో ఒకరు మృతి చెందిన విషయం తెలిసిందే.  కాగా ఈ ఘటనలో తొమ్మిదో తరగతి విద్యార్థి మరణించినట్లు SI మహేందర్ తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. నెక్కొండకు చెందిన మహమ్మద్ సాజిద్(16)మోడల్ స్కూల్‌లో చదువుతున్నాడు. స్కూల్ నుంచి మధ్యాహ్నం నెక్కొండకు స్కూటీపై వస్తున్నాడు. ఈ క్రమంలో CH సంతు బైక్‌పై నెక్కొండ నుంచి వెంకటాపురం వెళ్తూ వేగంగా స్కూటీని ఢీకొన్నాడు. ప్రమాదంలో సాజిద్ మరణించాడు.

error: Content is protected !!