News March 6, 2025
BREAKING.. వరంగల్: కూలీలతో వెళ్తున్న ఆటో బోల్తా.. ఒకరు మృతి

వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం కోనాపూరం శివారులో రోడ్డు ప్రమాదం జరిగింది. మిర్చి కూలీలతో వెళ్తున్న వాహనం బోల్తాపడింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. దాదాపు 20 మంది కూలీలకు గాయాలయ్యాయి. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. జీడిగట్టుతండా నుంచి ఇటుకలపల్లి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ప్రమాద సమయంలో ఆటోలో మొత్తం 35 మంది ఉన్నట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News November 7, 2025
దళితులైతే దాడులు చేస్తారా?: మందకృష్ణ మాదిగ

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయిపై కాలు, బూటుతో దాడి చేయడాన్ని MRPS వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ తీవ్రంగా ఖండించారు. ఆయన దళితుడు అయినందువల్లే ఇలాంటి దాడులకు పాల్పడ్డారని ఆయన మండిపడ్డారు. పాలమూరు విశ్వవిద్యాలయంలో గురువారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఈనెల 17న నిర్వహిస్తున్న ‘చలో ఢిల్లీ’ కార్యక్రమాన్ని పీయూ నుంచి భారీ సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
News November 7, 2025
NGKL: లైసెన్స్డ్ సర్వేయర్లకు అదనపు కలెక్టర్ దిశా నిర్దేశం

జిల్లా సమీకృత కలెక్టరేట్లో లైసెన్స్డ్ సర్వేయర్లకు అదనపు కలెక్టర్ పి. అమరేందర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏడీ ల్యాండ్ సర్వే నాగేందర్ సర్వేయర్లకు సూచనలు చేశారు. జిల్లాలో నాలుగు మండలాల్లోని నాలుగు గ్రామాలను పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి, ప్రభుత్వ భూములను గుర్తించి సర్వే చేయాలని ఆదేశించారు. జిల్లాలోని సర్వేయర్లు అంతా ఈ సమావేశంలో పాల్గొన్నారు.
News November 7, 2025
HYD: వాట్సప్లో ‘ది ఎండ్’ అని స్టేటస్.. యువతి సూసైడ్ అటెంప్ట్

ఔషాపూర్ అనురాగ్ యూనివర్సిటీలో BSC నర్సింగ్ 3rd ఇయర్ విద్యార్థిని పూజిత (22) కాలేజీ బిల్డింగ్ నుంచి దూకిన విషయం తెలిసిందే. తీవ్ర గాయాలు కాగా ఆమెను నిమ్స్కు తరలించారు. అన్నోజిగూడలో నివాసం ఉంటోంది. జ్వరం రావడంతో కళాశాలకు స్నేహితులతో వచ్చింది. బుధవారం వాట్సప్ స్టేటస్లో ‘ది ఎండ్’ అని పెట్టుకుంది. మధ్యాహ్నం లంచ్కి రాకుండా ఫోన్లో మాట్లాడి ఆత్మహత్యకు యత్నించింది. పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.


