News March 6, 2025

రాష్ట్రపతి భవన్‌లో ఏటికొప్పాక స్టాల్

image

దేశ రాజధాని ఢిల్లీ రాష్ట్రపతి భవన్‌లో ఏటికొప్పాక లక్క బొమ్మల స్టాల్‌ను ఏర్పాటు చేశారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి కళాకారులు రూపొందించిన బొమ్మలు, కలంకారి వస్త్రాలు తదితర హస్తకళా ప్రదర్శనను రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము బుధవారం సాయంత్రం ప్రారంభించినట్లు ఏటికొప్పాక కళాకారుడు శరత్ సత్యనారాయణ తెలిపారు. ఈ ప్రదర్శన ఈనెల తొమ్మిదవ తేదీ వరకు కొనసాగుతుందన్నారు.

Similar News

News November 11, 2025

రాజమండ్రి, కాకినాడ రైళ్లు రద్దు

image

విజయవాడ-దువ్వాడ సెక్షన్ల మధ్య రైల్వే ట్రాక్ పనులు జరుగుతున్నాయి. ఈక్రమంలో ఈనెల 20న నాలుగు రైళ్లను రద్దు చేశారు. కాకినాడ పోర్ట్-విశాఖ(17267), విశాఖ-కాకినాడ పోర్ట్(17268), రాజమండ్రి-విశాఖ(67285), విశాఖ-రాజమండ్రి(67286) రైళ్లు ఆ తేదీన తిరగవు. ప్రయాణికులు గమనించాలని రైల్వే శాఖ కోరింది.

News November 11, 2025

వీరు వేగంగా శ్రీవారి దర్శనం చేసుకోవచ్చు!

image

తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులకు ఏడాదిలోపు పిల్లలు ఉంటే వేగంగా దర్శనం చేసుకోవచ్చు. సుపథం ప్రవేశ ద్వారం వద్ద ప్రత్యేక కౌంటర్ ఉంటుంది. దర్శన సమయం 12PM నుంచి సాయంత్రం 6 వరకు ఉంటుంది. దీనికి ముందస్తు ఆన్‌లైన్ బుకింగ్ అవసరం లేదు. నేరుగా సుపథం వద్దకు వెళ్లి పిల్లల జనన ధ్రువీకరణ పత్రం & తల్లిదండ్రుల ఆధార్ కార్డులు సమర్పిస్తే చాలు. వీరితోపాటు 12ఏళ్లలోపు తోబుట్టువును అనుమతిస్తారు. share it

News November 11, 2025

ఈనెల 14న పీయూలో రెజ్లింగ్ ఎంపికలు

image

పాలమూరు వర్సిటీ నుంచి సౌత్ జోన్ ఆలిండియా యూనివర్సిటీలో పాల్గొనేందుకు రెజ్లింగ్ ఎంపికలు నిర్వహిస్తున్నట్లు వర్సిటీ PD డా.వై. శ్రీనివాసులు ‘Way2News’తో తెలిపారు. ఈనెల 14న యోగ (స్త్రీ) జట్ల ఎంపికలు ఉంటాయని, వయస్సు 17-25లోగా ఉండాలన్నారు. ప్రస్తుతం చదువుతున్న బోనఫైడ్, టెన్త్ మెమోతోపాటు ఎలిజిబుల్ ఫామ్ తీసుకొని రావాలని, 13లోగా పేర్లు నమోదు చేసుకోవాలి, ప్రతి కళాశాల నుంచి ఐదుగురు పాల్గొనవచ్చని అన్నారు.