News March 6, 2025
గన్నవరం: వంశీ బెయిల్ పిటిషన్పై నేడు విచారణ

వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్పై గురువారం విచారణ జరగనుంది. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో అరెస్టై రిమాండ్ ఖైదీగా వంశీ ఉన్నారు. వంశీని మరో 10 రోజుల పాటు కస్టడీకి కోరుతూ పోలీసులు విజయవాడ ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. గతంలో వంశీ సరిగ్గా సహకరించలేదని పిటీషన్లో పేర్కొన్నారు. ఈ కేసులో కీలక నిందితులుగా ఉన్న వ్యక్తులు పరారీలోనే ఉన్నారు.
Similar News
News March 6, 2025
MTM: యూజీ ఫస్ట్ సెమ్ పరీక్షా ఫలితాలు విడుదల

కృష్ణా యూనివర్శిటీ అనుబంధ కళాశాలలకు సంబంధించి UG మొదటి సెమిస్టర్ ఫలితాలను, UG వన్ టైమ్ పరీక్షా ఫలితాలను గురువారం విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య కె. రాంజీ విడుదల చేశారు. 7,212 మంది విద్యార్థులు పరీక్షలు వ్రాయగా 4,302 మంది ఉత్తీర్ణత సాధించారన్నారు. ఉత్తీర్ణతా శాతం 59.65%గా నమోదైందన్నారు. ఫస్ట్ సెమిస్టర్ పునఃమూల్యాంకనం కొరకు ఈ నెల 19వ తేదీ లోపు నిర్ణీత రుసుం చెల్లించి దరఖాస్తు చేసుకోవాలన్నారు.
News March 6, 2025
గూడూరు వద్ద ప్రమాదం.. డ్రైవర్ మృతి

విజయవాడ-మచిలీపట్నం జాతీయ రహదారిపై చిట్టి గూడూరు వద్ద గురువారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. విజయవాడ నుంచి వస్తున్న ఆర్టీసీ బస్సును వెనుక నుంచి టాటా మ్యాజిక్ వాహనం ఢీకొట్టింది.ఈ ప్రమాదంలో టాటా మ్యాజిక్ డ్రైవర్ బొల్లా మోహన్ రావు దుర్మరణం చెందారు. వాహనంలో ఉన్న ప్యాసింజర్లకు గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను బందరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
News March 6, 2025
పేదరిక నిర్మూలనే లక్ష్యంగా పీ4 సర్వే: కలెక్టర్

పేదరిక నిర్మూలనే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా పబ్లిక్, ప్రైవేట్, పీపుల్ పార్టనర్షిప్ (P4) సర్వేకు రూపకల్పన చేసిందని, ఈ నెల 8వ తేదీ నుంచి 18వ తేదీ వరకు జిల్లాలో నిర్వహించే ఈ సర్వేను విజయవంతం చేయాలని కృష్ణాజిల్లా కలెక్టర్ DK బాలాజీ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ మీటింగ్ హాలులో MPDOలు, మున్సిపల్ కమిషనర్లు, మండల ప్రత్యేక అధికారులతో సమీక్షించారు.