News March 6, 2025
వరంగల్ మార్కెట్లో తటస్థంగా పత్తి ధర

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో నిన్నటితో పోలిస్తే ఈరోజు పత్తి ధరలో ఎలాంటి మార్పు లేదు. సోమవారం క్వింటా పత్తి ధర రూ.6,880 పలకగా.. మంగళవారం రూ.6,920 పలికింది. బుధవారం స్వల్పంగా తగ్గి రూ.6,900కి చేరింది. అయితే గురువారం సైతం రూ.6,900 పలికినట్లు మార్కెట్ వ్యాపారులు తెలిపారు. అయితే పత్తి ధరలు పెరగకపోవడంతో రైతన్నలు నిరాశ చెందుతున్నారు.
Similar News
News March 20, 2026
WGL: ‘ఈనెల 23న ఆర్ట్, క్రాఫ్ట్ ప్రదర్శనలు’

పర్యావరణ పరిరక్షణపై విద్యార్థుల్లో అవగాహన పెంపొందించేందుకు ఈనెల23న మధ్యాహ్నం 3 గంటలకు కలెక్టరేట్లో 7వ,8వ,9వ తరగతుల విద్యార్థులు రూపొందించిన ఆర్ట్, క్రాఫ్ట్ ప్రదర్శనలు ఏర్పాటు చేయనున్నట్లు కలెక్టర్ డా.సత్య శారద తెలిపారు. ఇందులో ఉత్తమ ప్రదర్శనలను ఎంపిక చేసి, విజేతలకు బహుమతులు అందిస్తామని కలెక్టర్ తెలిపారు. విద్యార్థులు పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములై సృజనాత్మకతను ప్రదర్శించాలన్నారు.
News March 20, 2026
యాక్షన్ ప్లాన్ను రెండు రోజుల్లో సమర్పించాలి: వరంగల్ కలెక్టర్

ప్రతి శాఖ తమ 99 రోజుల యాక్షన్ ప్లాన్ను రెండు రోజుల్లో సిద్ధం చేసి సమర్పించాలని కలెక్టర్ డా.సత్య శారద ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయం కాన్ఫరెన్స్ హాల్లో 99 రోజుల ప్రగతి ప్రణాళికపై సమీక్ష సమావేశం నిర్వహించారు. వరంగల్ జిల్లాను అభివృద్ధిలో ముందంజలో నిలిపేందుకు అధికారులు సమన్వయంతో కృషి చేయాలన్నారు. ప్రజాప్రతినిధులను భాగస్వాములుగా చేసుకుని అభివృద్ధి కార్యక్రమాలు విస్తృతంగా అమలు చేయాలన్నారు.
News March 20, 2026
బడ్జెట్లో వరంగల్కు అన్యాయం.. మంత్రి స్పందించాలి: బీజేపీ

బడ్జెట్లో వరంగల్ జిల్లాకు అన్యాయం చేశారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్ అన్నారు. రాష్ట్ర బడ్జెట్పై ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. వరంగల్ ఎంజీఎం, సూపర్ స్పెషలిటీ హాస్పిటల్కు ఒక రూపాయి కూడా కేటాయించలేదన్నారు. ఎయిర్ పోర్ట్, టెక్స్ టైల్ పార్క్, హైవే రోడ్ల మాటలేదని, గ్రేటర్ వరంగల్కు మరో సారి మొండిచెయ్యి చూపారని, దీనిపై జిల్లా మంత్రి స్పందించాలని డిమాండ్ చేశారు.


