News March 6, 2025

ADB: ఆ తల్లిదండ్రులకు తీరని శోకం

image

కూతురు పుట్టిందని మురిసిన ఆ తల్లిదండ్రులకు తీరని శోకం మిగిలింది.. అమ్మానాన్న అంటూ పిలిచిన గొంతు నేడు వినిపించడం లేదు.. అల్లారుముద్దుగా పెంచిన కూతురు కళ్ల ముందు చనిపోతుంటే ఆ తల్లిదండ్రులు పడిన బాధ వర్ణనాతీతం.ADB రూరల్(M) లోకారికి చెందిన మహేశ్, లావణ్య దంపతుల కూతురు మనీషా(3)కు రెండేళ్ల క్రితం గుండె సంబంధిత ఆపరేషన్ జరిగింది. ఇటీవల అనారోగ్యానికి గురవగా బుధవారం చికిత్స పొందుతూ చనిపోయింది.

Similar News

News March 19, 2026

తిరుమలలో ఉగాది ఆస్థాన వేడుకలు

image

తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది ఆస్థానం నిర్వహించారు. సుప్రభాతం అనంతరం శుద్ధి చేసి, శ్రీదేవి భూదేవి సమేత మలయప్పస్వామివారికి విశేష పూజలు చేశారు. అనంతరం ఆలయంలో ఊరేగింపుగా ప్రవేశించి మూలవిరాట్టు, ఉత్సవమూర్తులకు నూతన వస్త్రాలు సమర్పించారు. పంచాంగ శ్రవణం నిర్వహించారు. బంగారు వాకిలి వద్ద శాస్త్రోక్తంగా ఆస్థానం జరిగింది.

News March 19, 2026

NZB: 89 మంది సభ్యులతో DCC నూతన కార్యవర్గం

image

నూతనంగా 89 మందితో నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యవర్గాన్ని గురువారం విస్తరించారు. ఇప్పటికే గత డిసెంబర్లో డీసీసీ అధ్యక్షునిగా కాటిపల్లి నగేష్ రెడ్డిని నియమించిన TPCC గురువారం పూర్తి స్థాయి కమిటీని ప్రకటించింది. ఇందులో 12 మందిని ఉపాధ్యక్షులుగా, 24 మందిని ప్రధాన కార్యదర్శులుగా, నలుగురిని అధికార ప్రతినిధులుగా, 48 మందిని కార్యదర్శులుగా ప్రకటించారు.

News March 19, 2026

శ్రీవారిని దర్శించుకున్న కలెక్టర్

image

తెలుగు నూతన సంవత్సరం ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని, కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్ కుటుంబ సభ్యులతో కలిసి గురువారం శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం వేద పండితులు ఆయనకు వేదాశీర్వచనం చేసి శ్రీవారి తీర్థప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ జిల్లా ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలిపారు.