News March 6, 2025
MDK: గెలిచినోళ్ల సంబరాలు.. ఓడినోళ్ల సమాలోచనలు

KNR-ADB-NZB-MDK పట్టభద్రుల MLC ఎన్నికల్లో BJP అభ్యర్థి అంజిరెడ్డి 5,106 ఓట్ల మెజార్టీతో గెలవగా ఆ పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. 2వ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి, 3వ స్థానంలో BSPఅభ్యర్థి ప్రసన్న హరికృష్ణ నిలిచారు. ఎలా ఓడిపోయామని అటు నరేందర్ రెడ్డి, ఇటు హరికృష్ణ శ్రేణులతో సమాలోచనలు చేస్తున్నారు. చెల్లని ఓట్లు 28,686 రాగా తమ ఓటమికి ఇదే ప్రధాన కారణమని ఆ పార్టీల నేతలు అంటున్నారు.
Similar News
News July 5, 2025
బాసర ట్రిపుల్ ఐటీకి ఎంపికైన జనగామ విద్యార్థిని

జనగామ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదివిన మేడారం రుచిక బాసర ట్రిపుల్ ఐటీకి ఎంపికైనట్లు పాఠశాల హెచ్ఎం కృష్ణమూర్తి తెలిపారు. అంబేడ్కర్ నగర్లోని నిరుపేద చేనేత కుటుంబానికి చెందిన మేడారం రవి, రాధ దంపతుల కూతురు రుచిక ట్రిపుల్ ఐటీకి ఎంపిక కావడంపై స్థానికులు అభినందించారు.
News July 5, 2025
ప్రపంచ టెస్టు క్రికెట్లో 10,000వ డకౌట్

భారత్-ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న రెండో టెస్టులో ఓ అరుదైన రికార్డు నమోదైంది. ఇంగ్లండ్ ఆటగాడు కార్స్ డకౌట్ ప్రపంచ టెస్టు క్రికెట్లో 10,000వ డకౌట్గా నిలిచింది. మహ్మద్ సిరాజ్ బౌలింగ్లో ఆయన LBWగా వెనుదిరిగారు. 1877లో ఎడ్వర్డ్ గ్రెగరీ తొలిసారి డకౌట్ అయిన ప్లేయర్గా ఉన్నారు. 10,000 డకౌట్లు కావడానికి దాదాపు శతాబ్దంన్నర పట్టింది. కాగా ఇంగ్లండ్ ఇన్నింగ్స్లో ఆరుగురు ప్లేయర్లు డకౌట్ కావడం విశేషం.
News July 5, 2025
ములుగు: కాంగ్రెస్ Vs బీఆర్ఎస్

ఈ నెల 7న కాంగ్రెస్ తీరుకు నిరసనగా బీఆర్ఎస్ నాయకులు నిరసనకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఇదే క్రమంలో కాంగ్రెస్ యూత్ నాయకులు నిరసన చేపట్టేందుకు సిద్ధమయ్యారు. ఇదే 7వ తేదీన జిల్లా కేంద్రంలో పదేళ్లు బీఆర్ఎస్ ఏం అభివృద్ధి చేసిందో చెప్పాలని, ఇద్దరి మృతికి కారణం బీఆర్ఎస్ నాయకులేనని ఆరోపిస్తూ నిరసనకు పిలుపునిచ్చారు. దీంతో జిల్లాలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.