News March 6, 2025

VKB: పలు మండలాల్లో దంచి కొడుతున్న ఎండలు

image

మార్చి నెల మొదటి వారంలోని ఎండల తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది.  జిల్లాలోని పలు మండలాలలో 33-36 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వడగాలులు కూడా తీవ్రంగా ఉంటాయని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. దీంతో మధ్యాహ్నం సమయంలో చిన్నారులు, వృద్ధులు సాధ్యమైనంత వరకు బయటకు రావద్దని, ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో వచ్చినా ఎండ వేడిమి నుంచి కాపాడుకునేలా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.  

Similar News

News March 1, 2026

TTD ఛైర్మన్ పదవి ఎవడబ్బ సొత్తు కాదు: BRనాయుడు

image

TTD ఛైర్మన్ పదవి ఎవడబ్బ సొత్తు కాదని, CM చంద్రబాబు చెబితేనే తాను పదవికి రిజైన్ చేస్తానని <<19270118>>BRనాయుడు<<>> అన్నారు. తాను బాధ్యతలు చేపట్టిన ఫస్ట్ రోజు నుంచే రాజీనామా చేయమని అడుగుతున్నారన్నారు. దీనిపై ఎందుకా అని ఆలోచిస్తే YCP చేసిన ఎన్నో అక్రమాలు బయటికి వస్తున్నాయన్నారు. తాను ఎక్కడా తగ్గేదేలే అన్నారు. వీడియోలో ఉన్న మహిళ కుటుంబానికి, తమ కుటుంబానికి 30 ఏళ్లుగా సంబంధాలు ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు.

News March 1, 2026

తీవ్రమైన యుద్ధం.. అమెరికాకు ఇరాన్ షాక్!

image

ఖమేనీ మరణం తర్వాత పశ్చిమాసియా యుద్ధం తీవ్రమవుతోంది. గల్ఫ్ దేశాల్లోని అమెరికా మిలిటరీ స్థావరాలపై ఇరాన్ దాడులను పెంచింది. కువైట్‌లోని US నావల్ బేస్‌పై 4 బాలిస్టిక్ మిస్సైళ్లు, 12 డ్రోన్లతో దాడి చేసినట్లు ఇరాన్ తెలిపింది. దీంతో ఆ షిప్ పూర్తిగా దెబ్బతిందని, భారీగా అమెరికా సైనికులు మరణించినట్లు వార్తలు వస్తున్నాయి. అటు UAEలోని అమెరికా MSP క్లాస్ షిప్‌పై 4 డ్రోన్లతో దాడి చేసినట్లు సమాచారం.

News March 1, 2026

రేపు PGRS, రెవిన్యూ క్లినిక్: కలెక్టర్ కీర్తి

image

రాజమండ్రి కలెక్టరేట్లో సోమవారం PGRS, రెవెన్యూ క్లినిక్‌లను యథావిధిగా నిర్వహించనున్నట్లు కలెక్టర్ కీర్తి చేకూరి ప్రకటించారు. అర్జీదారులు తమ అర్జీలను Meekosam.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చని తెలిపారు. అర్జీల నమోదు, నమోదైన అర్జీల స్థితి తదితర వివరాలకు 1100కు కాల్ చేయవచ్చని కలెక్టర్ సూచించారు.