News March 6, 2025

వికారాబాద్: ద్వితీయ సంవత్సరం పరీక్షకు 6, 963 మంది విద్యార్థులు

image

ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం మొదటి పరీక్షకు 6,963 మంది విద్యార్థులు హాజరుకానున్నట్లు జిల్లా ఇంటర్ బోర్డు నోడల్ అధికారి శంకర్ నాయక్ తెలిపారు. గురువారం ఇంటర్మీడియట్ పరీక్షల్లో భాగంగా ద్వితీయ సంవత్సరం లాంగ్వేజెస్ తెలుగు, సంస్కృతం పరీక్షలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. పరీక్షల నిర్వహణకు జిల్లాలో 29 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందన్నారు.

Similar News

News March 6, 2025

భాగస్వామితో కలిసి నిద్రిస్తే కలిగే ప్రయోజనాలివే..!

image

భార్యాభర్తలు కలిసి <<15666785>>నిద్రించడం<<>> వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయని నిపుణులు చెప్తున్నారు. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ మిస్సవ్వడం, ప్రెజర్స్, టార్గెట్స్, వేధించే ఒంటరితనానికి ఇదే అసలైన ఔషధం అంటున్నారు. లవ్ హార్మోన్ ఆక్సిటోసిన్ విడుదలై డిప్రెషన్, యాంగ్జైటీ, స్ట్రెస్ తగ్గుతాయని, ఆయు: ప్రమాణం, బంధంపై సంతృప్తి పెరుగుతాయని చెప్తున్నారు. భాగస్వామి నుంచి ప్రేమ, కంఫర్ట్, రిలాక్స్, హ్యాపీ, ప్రశాంతతను ఫీలవుతారన్నారు.

News March 6, 2025

MTM: యూజీ ఫస్ట్ సెమ్ పరీక్షా ఫలితాలు విడుదల

image

కృష్ణా యూనివర్శిటీ అనుబంధ కళాశాలలకు సంబంధించి UG మొదటి సెమిస్టర్ ఫలితాలను, UG వన్ టైమ్ పరీక్షా ఫలితాలను గురువారం విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య కె. రాంజీ విడుదల చేశారు. 7,212 మంది విద్యార్థులు పరీక్షలు వ్రాయగా 4,302 మంది ఉత్తీర్ణత సాధించారన్నారు. ఉత్తీర్ణతా శాతం 59.65%గా నమోదైందన్నారు. ఫస్ట్ సెమిస్టర్ పునఃమూల్యాంకనం కొరకు ఈ నెల 19వ తేదీ లోపు నిర్ణీత రుసుం చెల్లించి దరఖాస్తు చేసుకోవాలన్నారు.

News March 6, 2025

భర్త చేతిలో గాయపడిన భార్య మృతి

image

కొలిమిగుండ్ల మండలం బెలుం సింగవరం గ్రామంలో భర్త చిన్న వెంకటరామిరెడ్డి దాడిలో తీవ్రంగా గాయపడిన భార్య విద్య మనోహరమ్మ బనగానపల్లె ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. భార్యపై అనుమానం పెంచుకొని, తాగిన మైకంలో వెంకట్రామిరెడ్డి రోకలి బండతో భార్యపై దాడి చేశాడు. తీవ్ర రక్తస్రావంతో అపస్మారక స్థితిలో ఉన్న మనోహరమ్మను బనగానపల్లెకు తరలించగా మృతి చెందినట్లు సీఐ రమేశ్ బాబు తెలిపారు.

error: Content is protected !!