News March 6, 2025
శ్రీ సత్యసాయి జిల్లాలో 551మంది గైర్హాజరు

శ్రీ సత్యసాయి జిల్లా వ్యాప్తంగా 42 పరీక్ష కేంద్రాల్లో ఇంటర్ ఫస్టియర్ విద్యార్థులకు నేడు పార్ట్-3లోని పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షలకు జనరల్ విద్యార్థులలో 12,437 మందికి గానూ 11,985 మంది, ఒకేషనల్ విద్యార్థుల్లో 1,644 మందికి గానూ 1,545 మంది హాజరయ్యారు. మొత్తం 551 గైర్హాజరైనట్లు డీఐఈఓ రఘునాథ రెడ్డి తెలిపారు. పరీక్షలు ప్రశాంతంగా జరిగాయన్నారు.
Similar News
News July 9, 2025
మహిళా శిశు సంక్షేమ కార్యకలాపాలు పటిష్ఠంగా చేపట్టాలి: కలెక్టర్

మహిళా శిశు సంక్షేమ కార్యకలాపాలు పటిష్ఠంగా చేపట్టాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారిని ఫ్లోరెన్స్ ఆధ్వర్యంలో బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించి వారు మాట్లాడారు. 1098 నంబర్పై విస్తృత ప్రచారం చేయాలని సూచించారు. ప్రతి గ్రామంలో 200 మహిళలను వాట్సాప్ గ్రూప్ చేసి కార్యకలాపాలను చర్చించాలని, ర్యాలీలు చేపట్టాలన్నారు. బాల్య వివాహాలపై అవగాహన కల్పించాలన్నారు.
News July 9, 2025
ADBలో పర్యటించిన రీజినల్ జాయింట్ డైరెక్టర్

మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ రీజినల్ జాయింట్ డైరెక్టర్ ఝాన్సీలక్ష్మి బాయి బుధవారం ADB జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా పలు అంగన్వాడీ కేంద్రాలను, సఖీ కేంద్రం, బాలరక్షక్ భవన్, శిశుగృహను ఆమె సందర్శించారు. రికార్డులను పరిశీలించి పలు సూచనలు చేశారు. అనంతరం సీడీపీఓలు, సూపర్వైజర్లతో సమావేశం నిర్వహించారు. అంతకుముందు సఖి కేంద్రంలో మొక్కలు నాటారు. జిల్లా సంక్షేమ అధికారి మిల్కా ఉన్నారు.
News July 9, 2025
ADB: ‘సాంకేతిక పద్ధతులతో అధిక దిగుబడులు’

జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో కోరమండల్ కంపెనీ ఆధ్వర్యంలో వ్యవసాయ, ఉద్యాన శాఖల అధికారులతో కలెక్టర్ రాజర్షి షా బుధవారం సమావేశం ఏర్పాటు చేశారు. నానో ఎరువులు మట్టి ఆరోగ్యాన్ని మెరుగుపర్చడమే కాక, పంట దిగుబడుల పెంచుతాయని చెప్పారు. రైతులు సాంకేతికత పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని అధిక దిగుబడులు సాధించాలని పేర్కొన్నారు.