News March 6, 2025
ADB: మందు తాగిన దంపతులు.. భర్త మృతి

నేరడిగొండ మండలంలో విషాదం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. వడూర్ గ్రామానికి చెందిన రైతు ఈదపు పోశెట్టి (60), అతడి భార్య ఇందిర(52) అప్పుల బాధ భరించలేక గురువారం పురుగు మందు తాగారు. ఈ ఘటనలో పోశెట్టి మృతి చెందగా ఇందిర పరిస్థితి విషమంగా ఉంది. పంట సాగులో నష్టం రావడం, ఇద్దరు పిల్లలకు పెళ్లి చేయడంతో అప్పులు అయ్యాయనే మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడినట్లు స్థానికులు తెలిపారు.
Similar News
News March 29, 2026
కర్నూలు: యువకుడి దారుణ హత్య

సి.బెళగల్ మండలం కె.శింగవరంలో మల్లేశ్ అనే యువకుడు దారుణ హత్యకు గురైన ఘటన శనివారం స్థానికంగా కలకలం రేపింది. ప్రత్యర్థులు వేటకొడవళ్లతో దాడి చేసి విచక్షణ రహితంగా నరికి చంపారు. తీవ్ర గాయాలతో మల్లేశ్ అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న సీఐ తబ్రేజ్ ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేశారు. పాత కక్షలే ఈ హత్యకు కారణమై ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.
News March 29, 2026
ఆస్తి పన్ను బకాయిలపై డిస్కౌంట్.. మరో రెండు రోజులే గడువు

తెలుగు రాష్ట్రాల్లో మున్సిపాలిటీ, కార్పొరేషన్లలో ఆస్తి పన్ను బకాయిలపై అమలులో ఉన్న <<19403603>>డిస్కౌంట్కు<<>> గడువు మరో రెండు రోజులే ఉంది. మార్చి 31లోగా పన్ను బాకీ చెల్లిస్తే వడ్డీలో 50% రాయితీ కల్పిస్తామని ఏపీ ప్రభుత్వం ఈనెల 17న ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు TGలో హైదరాబాద్ పరిధిలో ఆస్తి పన్ను బకాయిలపై 90 శాతం వడ్డీ మినహాయింపును GHMC కల్పిస్తోంది. దీనికి కూడా మార్చి 31 లాస్ట్ డేట్.
News March 29, 2026
ఆస్తి పన్ను బకాయిలపై డిస్కౌంట్.. మరో రెండు రోజులే గడువు

తెలుగు రాష్ట్రాల్లో మున్సిపాలిటీ, కార్పొరేషన్లలో ఆస్తి పన్ను బకాయిలపై అమలులో ఉన్న <<19403603>>డిస్కౌంట్కు<<>> గడువు మరో రెండు రోజులే ఉంది. మార్చి 31లోగా పన్ను బాకీ చెల్లిస్తే వడ్డీలో 50% రాయితీ కల్పిస్తామని ఏపీ ప్రభుత్వం ఈనెల 17న ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు TGలో హైదరాబాద్ పరిధిలో ఆస్తి పన్ను బకాయిలపై 90 శాతం వడ్డీ మినహాయింపును GHMC కల్పిస్తోంది. దీనికి కూడా మార్చి 31 లాస్ట్ డేట్.


