News March 6, 2025
సంగారెడ్డి: ఇంటర్ విద్యార్థులారా.. ఇది మీ కోసమే..!

ఇంటర్ ఎగ్జామ్స్ రాసే విద్యార్థులు ఖాళీ కడుపుతో రాకుండా త్వరగా జీర్ణం అయ్యే ఆహారాలైన ఇడ్లీ లేదా చద్దన్నం లాంటివి తిని రావాలని సంగారెడ్డి జిల్లా వైద్యాధికారులు సూచిస్తున్నారు. అలాగే ఎక్కువగా నీరు తాగుతుండాలన్నారు. పరీక్షలు రాసే సమయంలో ఆరోగ్యపరంగా ఏమైనా ఇబ్బంది అనిపిస్తే సెంటర్లో అందుబాటులో ఉండే హెల్త్ అసిస్టెంట్లను సంప్రదించవచ్చని తెలిపారు. ప్రతిరోజు కనీసం 8గంటల నిద్ర ఉండాలన్నారు.
Similar News
News January 17, 2026
కాకినాడ చేరుకున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శనివారం కాకినాడ రూరల్లోని జీఎం గ్రీన్ అమ్మోనియా ప్లాంట్కు చేరుకున్నారు. హెలికాప్టర్ ద్వారా నేరుగా ప్లాంట్ ప్రాంగణానికి విచ్చేసిన ఆయనకు కలెక్టర్ అపూర్వ భరత్, ఐజీ అశోక్ కుమార్, ఎంపీ సానా సతీష్ కుమార్ స్వాగతం పలికారు. ప్లాంట్ శంకుస్థాపన కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి పవన్ కళ్యాణ్ పాల్గొననున్నారు. పోలీసులు పట్టణంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
News January 17, 2026
సంగారెడ్డి: ఓపెన్ విద్యార్థులకు కీలక సూచన

సంగారెడ్డి జిల్లాలో ఓపెన్ స్కూల్ ద్వారా పదో తరగతి, ఇంటర్ చదువుతున్న విద్యార్థులు కాంటాక్ట్ తరగతులను సద్వినియోగం చేసుకోవాలని కో-ఆర్డినేటర్ వెంకటస్వామి సూచించారు. ప్రతి ఆదివారం, ఇతర సెలవు దినాల్లో ఈ తరగతులు నిర్వహిస్తామని తెలిపారు. దూరవిద్య అభ్యసించే వారికి నిపుణులైన ఉపాధ్యాయులతో సందేహ నివృత్తి జరుగుతుందని, విద్యార్థులు ఈ అవకాశాన్ని వదులుకోకుండా పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించాలని కోరారు.
News January 17, 2026
సీఎం రూట్ అని తెలిసినా వినలేదు.. కేసు నమోదు

సీఎం రూట్ ఉన్న విషయం తెలిసి కూడా జూబ్లీహిల్స్లోని ఓ పబ్ యజమాని అక్రమ పార్కింగ్లు చేశాడంటూ జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 45లోని ఫ్యాట్ పిజీయన్ పబ్ నిర్వాహకులు సీఎం రూట్ ఉందని చెప్పినా వినిపించుకోకుండా తమ కస్టమర్లతో వాహనాలను పార్కింగ్ చేయించడంతో సీఎం రూట్లో ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో పబ్ నిర్వాహకులపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


