News March 7, 2025
సంగారెడ్డి: ఇంటర్ రెండో సంవత్సరం మొదటి పరీక్షకు 98.11% హాజరు

జిల్లాలో 54 పరీక్ష కేంద్రాలలో గురువారం జరిగిన ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం పబ్లిక్ పరీక్షల్లో 15,989 మంది విద్యార్థులకు గాను 15,687 మంది విద్యార్థులు హాజరయ్యారని (98.11%)ఇంటర్మీడియట్ జిల్లా అధికారి గోవింద్ రాం తెలిపారు. 302 మంది విద్యార్థులు పరీక్షకు గైర్హాజరైనట్లు పేర్కొన్నారు.
Similar News
News March 20, 2026
మార్చి 20: చరిత్రలో ఈ రోజు

1351: ఢిల్లీ సుల్తాన్ మహమ్మద్ బిన్ తుగ్లక్ మరణం
1602: డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ స్థాపన
1980: టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్ జననం
1987: టాలీవుడ్ సింగర్ హరిచరణ్ జననం
2008: సినీ నటుడు శోభన్ బాబు మరణం(ఫొటోలో)
*అంతర్జాతీయ సంతోష దినం
News March 20, 2026
తండ్రి అయిన RCB కెప్టెన్

RCB కెప్టెన్ రజత్ పాటీదార్ తండ్రి అయ్యారు. ఆయన భార్య గుంజన్ పండంటి మగ బిడ్డకు నిన్న జన్మనిచ్చారు. దీంతో IPL ప్రారంభానికి వారం రోజుల ముందే వారి ఇంట్లో ఆనందం వెల్లివెరిసింది. మధ్యప్రదేశ్లోని ఇండర్కు చెందిన పాటీదార్ 2022లో గుంజన్ను వివాహమాడారు. మరోవైపు మాజీ క్రికెటర్ దినేశ్ కార్తీక్ కూడా <<19424001>>ఉగాది రోజునే<<>> మరోసారి తండ్రయ్యారు. దినేశ్, పాటీదార్ ఒకేరోజు పుట్టడం(జూన్ 1) విశేషం.
News March 20, 2026
ఇరాన్తో యుద్ధం కోసం ₹18 లక్షల కోట్లు!

ఇరాన్తో యుద్ధం కొనసాగించేందుకు $200 బిలియన్లు(₹18 లక్షల కోట్లు) కావాలని US కాంగ్రెస్ను పెంటగాన్ కోరినట్లు తెలుస్తోంది. ఇది ఇరాన్ ఎకానమీ($356B)లో సగం కంటే ఎక్కువ కావడం గమనార్హం. యుద్ధం మొదలైన తొలి వారంలోనే US $11B పైగా ఖర్చు చేసింది. ‘$200B అంటే చిన్న మొత్తమే. US ఎకానమీని దెబ్బతీస్తున్న ఇజ్రాయెల్ PM నెతన్యాహుకు అమెరికన్లు థాంక్స్ చెప్పాలి’ అని ఇరాన్ విదేశాంగ మంత్రి అరాఘ్చీ ఎద్దేవా చేశారు.


