News March 7, 2025

MBNR: నేడు ఘనంగా మహిళా దినోత్సవం: కలెక్టర్

image

ఈనెల 7న అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్ని జిల్లా కలెక్టరేట్ లోని సమావేశపు హాల్లో అధికారికంగా నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి ఒక ప్రకటన తెలిపారు. ముఖ్య అతిథులుగా ఎంపీటీకే అరుణ, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి, జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి, దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డిలతోపాటు మూఢా ఛైర్మన్ లక్ష్మణ యాదవులు హాజరవుతున్నట్లు పేర్కొన్నారు.

Similar News

News March 9, 2025

గిగా కంపెనీతో పాలమూరు రూపురేఖలు మారతాయి: కేంద్ర మంత్రి

image

అమర్ రాజా కంపెనీ ప్రతిష్ఠాత్మకంగా రూ.3,225 కోట్లతో నిర్మిస్తున్న గిగా ఫ్యాక్టరీతో పాలమూరు రూపురేఖలు మారడం ఖాయమని కేంద్ర రైల్వే శాఖ సమాచార ప్రసార ఐటీ శాఖ మంత్రి అశ్విన్ వైష్ణవ్ అన్నారు. శనివారం దివిటిపల్లి గ్రామంలో కంపెనీ ప్రారంభం అనంతరం మంత్రి శ్రీధర్ బాబు, ఎంపీ డీకే అరుణ, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డిలతో కలిసి నూతనంగా నిర్మిస్తున్న ప్లాంటును పరిశీలించారు.

News March 8, 2025

నేడు పాలమూరుకు కేంద్రమంత్రి రాక

image

కేంద్ర రైల్వే, టెక్నాలజీ ఇన్ఫర్మేషన్, బ్రాడ్‌కాస్టింగ్ మంత్రి అశ్విని వైష్ణవ్ నేడు MBNR జిల్లాకు రానున్నారు. స్థానిక ఎంపీ డీకే అరుణతో కలిసి జిల్లాలో పలు ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలలో ఆయన పాల్గొననున్నారు. ఉదయం 10:30 గంటలకు దివిటిపల్లిలోని అమరరాజు బ్యాటరీ కంపెనీ ఏర్పాటుకు నిర్వహించే భూమి పూజలో కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ పాల్గొంటారని బీజేపీ శ్రేణులు పేర్కొన్నారు.

News March 8, 2025

MBNR: క్రమబద్ధీకరణతో ప్రజలకు లబ్ధి చేకూర్చండి: ప్రిన్సిపల్ సెక్రటరీ

image

అక్రమ లేఅవుట్లను క్రమబద్ధీకరణ చేసేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాన్ని ప్రజలకు లబ్ధి కల్పించేలా కృషి చేయాలని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్,  అర్బన్ డెవలప్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ దాన కిషోర్ జిల్లా అధికారులను ఆదేశించారు. శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా అధికారులతో ఎల్ఆర్ఎస్ పథకంపై సమీక్ష నిర్వహించారు. జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలతో పాటు గ్రామపంచాయతీలో ప్రచారం చేపట్టాలన్నారు.

error: Content is protected !!