News March 7, 2025
జనగామ: విద్యార్థులకు ముఖ్య గమనిక

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 2025-26 విద్యా సంవత్సరానికి పాఠశాల, కళశాలల్లో ప్రవేశం పొందేందుకు గడువు పొడిగించారు. 5 నుంచి 8వ తరగతి, ఇంటర్ ఫస్టియర్లో ప్రవేశం పొందేందుకు మార్చి 31వ తేదీ వరకు గడువు పొడిగించినట్లు జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి విక్రమ్ కుమార్ తెలిపారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు
Similar News
News March 7, 2025
కృష్ణా: పేర్ని నానికి హైకోర్టులో ఊరట

మాజీ మంత్రి, వైసీపీ నేత పేర్ని నానికి హైకోర్టులో ఊరట లభించింది. శుక్రవారం హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. రేషన్ బియ్యం మిస్సింగ్ కేసులో ఏ6గా పేర్ని నాని ఉన్నారు. ఇదిలా ఉండగా ఇటీవల పలుమార్లు టీడీపీ నేతలు త్వరలోనే పేర్ని నాని అరెస్ట్ కాబోతున్నారని వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో హైకోర్టు ముందస్తు బెయిల్ ఇవ్వడం ఆసక్తికి తెరలేపింది.
News March 7, 2025
రాష్ట్రంలోనే టాప్ నిజామాబాద్ జిల్లా

నిజామాబాద్ జిల్లాలో ఎండ తీవ్రత భారీగా పెరిగింది. గురువారం జిల్లాలోని మంచిప్పలో 40.8℃, తూంపల్లిలో 40.7℃ డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. దీంతో ఈ ప్రాంతాలు రాష్ట్రంలోనే తొలి రెండు స్థానాల్లో నిలిచాయి. అటు వాతావరణ శాఖ ఈ ప్రాంతాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. రాష్ట్రంలో ఈ రెండు ప్రాంతాలు మాత్రమే ఆరెంజ్ జోన్లో ఉన్నాయి. జిల్లాలోని మిగతా ప్రాంతాల్లోనూ అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
News March 7, 2025
నరసరావుపేట ఎమ్మెల్యే ధర్నా

నరసరావుపేట ఎమ్మెల్యే అరవింద్ బాబు ఎక్సైజ్ కమిషనర్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో హల్చల్ చేసిన ఘటన చోటు చేసుకుంది. ఎమ్మెల్యే కార్యాలయం నుంచి వచ్చిన లేఖపై ఎక్సైజ్ కమిషనర్ స్పందించకపోవడంతో ఎమ్మెల్యే నేరుగా అక్కడికి చేరుకొని నిరసన తెలియజేశారు. మంత్రి కొల్లు రవీంద్ర ఫోన్ చేసినా ఎమ్మెల్యే అంగీకరించలేదని సమాచారం. చివరకు దీనిపై చర్యలు తీసుకోవాలని ఆదేశాలు రావడంతో ఎమ్మెల్యే అక్కడి నుంచి వెళ్లిపోయారు.