News March 7, 2025
దొరస్వామి నాయుడు మృతికి చిత్తూరు MP సంతాపం

కుప్పం పీఈఎస్ మెడికల్ కళాశాల వ్యవస్థాపకులు దొరస్వామి నాయుడు మరణం తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు అన్నారు. గురువారం బెంగళూరులో దొరస్వామి నాయుడు మరణం పట్ల ఎంపీ ఢిల్లీలో ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. కుప్పంలో పీఈఎస్ మెడికల్ కళాశాల స్థాపించడం ద్వారా ఎంతో సేవ చేశారని కొనియాడారు.
Similar News
News March 28, 2026
చిత్తూరు: పంచాయితీ అక్రమాలపై ఫిర్యాదులకు సిద్దం.?

చిత్తూరు జిల్లాలోని 811 పంచాయితీలలో ఏప్రిల్ 3 నుంచి ప్రత్యేకాధికారుల పాలన ప్రారంభం కానుంది. దీంతో కూటమి నేతలు గత ఐదేళ్ల కాలంలో జరిగిన అవినీతి అక్రమాలపై ఫిర్యాదులు చేయడానికి సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. వాటిపై విచారణ చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయనున్నారు. ఇది పార్టీల మధ్య కొత్త సమస్యకు దారి తీయనుందనే ప్రచారం కూడా జరుగుతోంది.
News March 28, 2026
జీడీ నెల్లూరు వ్యక్తి బ్లాక్మెయిల్ దందా.. రూ.50 లక్షలు డిమాండ్

జీడీ నెల్లూరు మండలానికి చెందిన తుమ్మలపల్లి వీరయ్య, మరో వ్యక్తితో కలిసి సబ్-రిజిస్ట్రార్ను లక్ష్యంగా చేసుకుని బ్లాక్మెయిల్ దందాకు పాల్పడ్డాడు. వ్యక్తిగత సమాచారాన్ని సేకరించి, ఫోన్ కాల్స్, వాట్సాప్ సందేశాల ద్వారా బెదిరింపులకు దిగుతూ, రూ.50 లక్షలు, ఇంటి స్థలం ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు మదనపల్లి పోలీసులు తెలిపారు. ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు తెలిపారు.
News March 27, 2026
ముగిసిన నారా భువనేశ్వరి కుప్పం పర్యటన

CM చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి నాలుగు రోజుల కుప్పం నియోజకవర్గ పర్యటన ముగిసింది. నాలుగు రోజుల పాటు నియోజకవర్గ వ్యాప్తంగా అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కుప్పంలో ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన స్వయం ఉపాధికి చేయూత కార్యక్రమం ముగించుకుని రోడ్డు మార్గాన బెంగళూరు వెళ్లి అక్కడ నుంచి హైదరాబాద్ వెళ్లనున్నారు.


