News March 7, 2025

జహీరాబాద్‌లో విషాదం.. పొలంలో విద్యుత్ షాక్‌తో అన్నదమ్ములు మృతి

image

జహీరాబాద్ మండలం గోవింద్‌పూర్ గ్రామంలో గురువారం రాత్రి విషాదకర ఘటన చోటుచేసుకుంది. పొలంలో ప్రమాదవశత్తు విద్యుత్ షాక్‌కు గురై మధుగొండ జగన్, మల్లేష్ అన్నదమ్ములు ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు, సంబంధిత అధికారులు ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. పూర్తివివరాలు తెలియాల్సి ఉంది. కాగా, గత సంవత్సరం ఇదే కుటుంబానికి చెందిన తండ్రి నాగన్న పాము కాటుకు గురై మరణించడం గమనార్హం.

Similar News

News March 7, 2025

ఏపీ ప్రభుత్వ అప్పులు రూ.5.19 లక్షల కోట్లు: పయ్యావుల

image

AP: రాష్ట్ర అప్పులపై వైసీపీ సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అసెంబ్లీలో రాతపూర్వక సమాధానమిచ్చారు. జూన్ 12, 2024 నాటికి ఏపీ ప్రభుత్వ అప్పులు రూ.5,19,192 కోట్లు, ప్రభుత్వ గ్యారంటీతో PSUల అప్పులు రూ.1,58,657 కోట్లు, GOVT గ్యారంటీ లేని PSU అప్పులు రూ.90,019 కోట్లు అని వెల్లడించారు. 2014 నుంచి సంవత్సరాల వారీగా అప్పుల వివరాల పీడీఎఫ్ కాపీ కోసం <>ఇక్కడ క్లిక్<<>> చేయండి.

News March 7, 2025

SHOCKING: వన్డే కెప్టెన్సీకి రోహిత్ గుడ్ బై?

image

ఛాంపియన్స్ ట్రోఫీ ముగిసిన అనంతరం ODI కెప్టెన్సీకి రోహిత్ గుడ్ బై చెప్పే అవకాశం కనిపిస్తోంది. NDTV కథనం ప్రకారం.. చీఫ్ సెలక్టర్ అగార్కర్, కోచ్ గంభీర్‌తో జరిగిన సమావేశంలో రోహిత్ ఈ విషయాన్ని స్పష్టం చేశారు. తర్వాతి ODI ప్రపంచకప్ సమయానికి టీమ్ ఇండియా కొత్త సారథిని తయారుచేసేందుకు ఇదే సమయమని ఆయన భావించినట్లు తెలుస్తోంది. ఫిట్‌నెస్ బాగున్నంత కాలం ప్లేయర్‌గా కొనసాగేందుకు ఆయన సుముఖత చూపించినట్లు సమాచారం.

News March 7, 2025

జెప్టో, బ్లింకిట్ యూజర్లు, సెల్లర్లకు షాక్!

image

లాభదాయకత, ఆదాయం పెంచుకొనేందుకు సెల్లర్లు, యూజర్లకు బ్లింకిట్, జెప్టో షాకివ్వబోతున్నట్టు తెలిసింది. యూజర్ల ఫీజు, సెల్లర్లు, బ్రాండ్ల కమీషన్ పెంచుతాయని సమాచారం. క్విక్ కామర్స్ వ్యాపారాలకు ఎక్కువ నగదు అవసరం అవుతోంది. ఇది ఇన్వెస్టర్లను కలవరపెడుతోంది. ఫలితంగా జొమాటో, స్విగ్గీ వంటి షేర్ల విలువలు పడిపోతున్నాయి. అందుకే యూనిట్ ఎకనామిక్స్‌ను బలోపేతం చేసుకోవాలని సదరు కంపెనీలు నిర్ణయించుకున్నాయి.

error: Content is protected !!