News March 7, 2025

మంథని: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

image

మంథని మండలం బిట్టుపల్లి గ్రామ మూల మలుపు వద్ద రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందారు. బైక్‌‌పై వెళ్తున్న వ్యక్తి చెట్టును ఢీకొట్టారు. ఈ ఘటనలో ఒకరు మృతి చెందా మరొకరికి గాయాలయ్యాయి. మృతిని పేరు ఉదయ్‌గా గుర్తించారు. గాయాలైన వ్యక్తిని అంబులెన్స్‌లో మంథని హాస్పిటల్‌కి తరలించారు. హైదరాబాద్ (గచ్చిబౌలి) నుంచి రెండు బైక్‌లపై నలుగురు యువకులు ఖమ్మంపల్లిలో స్నేహితుని వివాహానికి వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.

Similar News

News January 30, 2026

KNR: గిరిజన విద్యార్థులకు ఉపకార వేతనాలు

image

కరీంనగర్ జిల్లాలోని గిరిజన విద్యార్థులు ప్రీ-మెట్రిక్ ఉపకార వేతనాల కోసం మార్చి 1వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి (DTDO) కె.సంగీత తెలిపారు. 5 నుంచి 8వ తరగతి విద్యార్థులు ‘న్యూ స్కీమ్’ కింద, 9, 10వ తరగతి విద్యార్థులు ‘రాజీవ్ విద్యా దీవెన’ పథకం ద్వారా ఈపాస్ (e-pass) పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. దరఖాస్తుల హార్డ్ కాపీలను వెంటనే కార్యాలయంలో సమర్పించాలన్నారు.

News January 30, 2026

KNR: పురపోరు.. ముగ్గురు నేతల ముక్కోణపు వ్యూహం!

image

కరీంనగర్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల నగారా మోగడంతో రాజకీయం వేడెక్కింది. మంత్రి పొన్నం ప్రభాకర్ పట్టు కోసం అధికార బలంతో పావులు కదుపుతుండగా, కేంద్ర మంత్రి బండి సంజయ్ గ్రామపంచాయతీ ఎన్నికల జోరును కొనసాగించేలా ‘కమల వ్యూహం’ అమలు చేస్తున్నారు. మాజీ మంత్రి గంగుల కమలాకర్ తన కేడర్‌ను కాపాడుకుంటూ గులాబీ జెండా ఎగురవేయాలని పట్టుదలతో ఉన్నారు. దీంతో ప్రధాన పార్టీల మధ్య ఆధిపత్య పోరు రసవత్తరంగా మారింది.

News January 29, 2026

KNR: మున్సిపల్ పోరు.. టికెట్ల కోసం ‘జంపింగ్’ల జోరు

image

కరీంనగర్ నగరపాలక సంస్థ ఎన్నికల వేళ టికెట్ల వేటలో నేతలు పార్టీల గీతలు దాటుతున్నారు. ప్రధాన పార్టీల నుంచి పోటీ చేసేందుకు ఆశావహుల సంఖ్య పెరగడంతో ‘జంపింగ్ జిలానీల’ సందడి నెలకొంది. ఆయా పార్టీల్లో సీటు దక్కని వారు పక్క పార్టీల వైపు చూస్తూ సమీకరణాలను మారుస్తున్నారు. గెలుపు గుర్రాలకే ప్రాధాన్యం దక్కుతుందన్న అంచనాతో, జెండాలు మారుస్తున్న నేతల తీరుతో నగర రాజకీయం వేడెక్కింది.