News March 7, 2025
అచ్చంపేటలో యువతి అనుమానాస్పద మృతి

ACPTలోని ఇంద్రనగర్ కాలనీకి చెందిన ఆవుల లక్ష్మి (28) గురువారం అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందింది. ఎస్సై రమేష్ వివరాలిలా.. ఫైనాన్స్ వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్న ఆమె తెల్లవారుజామున పట్టణంలోని సీతారాలగుట్ట సమీపంలో చెట్టుకు ఉరివేసుకుని కనిపించింది. గమనించిన స్థానికులు అచ్చంపేట పోలీసులకు సమాచారం అందించారు. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసునమోదు చేసి విచారిస్తున్నామని ఎస్ఐ అన్నారు.
Similar News
News March 7, 2026
మౌలిక వసతుల కల్పనలో జిల్లా నివేదికలను సిద్ధం చేయాలి: కలెక్టర్

ఈనెల 11, 12వ తేదీల్లో రాష్ట్ర రాజధానిలో జరగనున్న 5వ కలెక్టర్ల కాన్ఫరెన్స్ను పురస్కరించుకొని కలెక్టర్ దినేష్ కుమార్ శనివారం కలెక్టరేట్ నుంచి రెండు జిల్లాలలోని జిల్లా స్థాయి అధికారులతో, వర్చువల్, వీసీ నిర్వహించారు. గత కాన్ఫరెన్స్లో ప్రభుత్వం సూచించిన లక్ష్యాల అమలు తీరుపై సమగ్ర నివేదికలను సిద్ధం చేయాలన్నారు. మౌలిక సదుపాయాల కల్పనలో జిల్లా సాధించిన పురోగతిని స్పష్టంగా అర్థమయ్యేలా రూపొందించాలన్నారు.
News March 7, 2026
కాకినాడ: నిరుద్యోగులకు GOOD NEWS

కాకినాడలో జిల్లా ఉపాధి కార్యాలయంలో ఈనెల 12న ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారి జి.శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ జాబ్ మేళాలో బీఎస్సీ కెమిస్ట్రీ, బీఫార్మసీ, ఎం.ఫార్మసీ చదివిన అభ్యర్థులు పాల్గొనవచ్చని తెలిపారు. అభ్యర్థులు తమ సర్టిఫికెట్ జిరాక్స్లతో ఆరోజు ఉదయం 10:30 గంటలకు హాజరు కావాలన్నారు. మరిన్ని వివరాలకు 8639846568 నంబర్ను సంప్రదించాలన్నారు.
News March 7, 2026
నెల్లూరు జిల్లాలో మహిళలే రథసారథులుగా.!

మహిళా అధికారులే జిల్లాను నడిపిస్తున్నారు. SP అజిత వేజెండ్ల, ASPలు దీక్ష, సౌజన్య DMHO సుజాత, గంగా భవాని(డ్వామా), నాగరాజకుమారి(DRDA), లీలారాణి(మెప్మా), శాంతి(మత్స్య), షమీమ్(RTC DM), రాజకీయంగా MLAలు ప్రశాంతి రెడ్డి, నెలవల విజయశ్రీ, ZP ఛైర్పర్సన్ ఆనం అరుణమ్మ, మేయర్ దేవరకొండ సుజాత, గ్రంథాలయ ఛైర్మన్ మేకపాటి శాంతకుమారి జిల్లాను రథసారథులుగా నడిపిస్తున్నారు.
# అంతర్జాతీయ మహిళా దినోత్సవం స్పెషల్.


