News March 7, 2025

ఉచిత బస్సు ప్రయాణం జిల్లాల వరకే: మంత్రి సంధ్యారాణి

image

AP: మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం జిల్లాల వరకే పరిమితమని మంత్రి గుమ్మడి సంధ్యారాణి మండలిలో తెలిపారు. ఉచిత బస్సు పథకం కోసం మహిళలు ఎదురుచూస్తున్నారని YCP సభ్యుడు PV సూర్యనారాయణరాజు అన్నారు. దీనిపై మంత్రి స్పందిస్తూ.. ఏ జిల్లాల్లోని మహిళలకు, ఆ జిల్లాల్లోనే RTC ఉచిత ప్రయాణానికి అనుమతించాలని నిర్ణయించామన్నారు. TG, కర్ణాటకలో RTC ఉచిత ప్రయాణం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న విషయం తెలిసిందే.

Similar News

News November 14, 2025

APPLY NOW: NIPHMలో ఉద్యోగాలు

image

నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్లాంట్ హెల్త్ మేనేజ్‌మెంట్ (<>NIPHM<<>>) 3పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు డిసెంబర్ 13వరకు అప్లై చేసుకోవచ్చు. జాయింట్ డైరెక్టర్, అసిస్టెంట్ డైరెక్టర్, ల్యాబ్ అటెండెంట్ పోస్టులు ఉన్నాయి. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో పీజీ, పీహెచ్‌డీ, టెన్త్, ITI/వొకేషనల్ కోర్సు ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వెబ్‌సైట్: https://niphm.gov.in/

News November 14, 2025

‘సంతాన ప్రాప్తిరస్తు’ మూవీ రివ్యూ

image

పెద్దలకు ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్న ఓ యువకుడు బిడ్డను కనే ప్రయత్నంలో ఎదురైన ఆరోగ్య సమస్యను ఎలా అధిగమించాడన్నదే ఈ చిత్ర కథ. బోల్డ్ పాయింట్‌ను డైరెక్టర్ సంజీవ్ వల్గారిటీ లేకుండా ఫ్యామిలీతో చూసేలా తీశారు. విక్రాంత్, చాందినీ చౌదరి పాత్రలు, తరుణ్ భాస్కర్, వెన్నెల కిశోర్ కామెడీ ప్లస్. కొన్ని సాగదీత సన్నివేశాలు, రొటీన్ అనిపించే కథ, అక్కడక్కడా ఎమోషన్స్ తేలిపోవడం మూవీకి మైనస్ అయ్యాయి.
రేటింగ్: 2.5/5

News November 14, 2025

ఆర్జేడీకే ఎక్కువ ఓట్లు వచ్చినా..!

image

ప్రతిపక్ష ఆర్జేడీని మరోసారి పరాజయం వెంటాడింది. బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని పార్టీల కన్నా ఎక్కువ ఓట్లు వచ్చినా అదే స్థాయిలో సీట్లను సాధించలేకపోయింది. 143 సీట్లలో పోటీ చేసిన ఆర్జేడీ 22.84 శాతం ఓట్లు సాధించింది. ఇవి బీజేపీకి వచ్చిన ఓట్ల కంటే 1.86 శాతం, జేడీయూ కంటే 3.97 శాతం ఎక్కువ. ప్రస్తుతం 26 సీట్లలోనే ఆర్జేడీ ఆధిక్యంలో ఉండటం గమనార్హం. ఎన్డీయే 204 స్థానాల్లో లీడ్‌లో ఉంది.