News March 7, 2025

KMR: ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలు.. గైర్హాజరు ఎంతమందంటే..?

image

ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలు గురువారం ప్రశాంతంగా జరిగాయి. జిల్లాలోని 38 పరీక్షా కేంద్రాల్లో పరీక్ష జరిగాయి. జనరల్ గ్రూప్‌కు సంబంధించి 7278 మంది పరీక్ష రాయాల్సి ఉండగా, 141 మంది పరీక్షకు దూరంగా ఉన్నారు. ఒకేషనల్ విభాగంలో 671 మందికి హాజరు కావాల్సి ఉండగా, 19 మంది గైర్హాజరయ్యారని కామారెడ్డి జిల్లా ఇంటర్ నోడల్ అధికారి షేక్ సలాం తెలిపారు. బాన్సువాడలో పరీక్ష కేంద్రాన్ని సబ్ కలెక్టర్ కిరణ్మయి పరిశీలించారు.

Similar News

News March 4, 2026

WNP: ప్రశాంత వాతావరణంలో ఇంటర్ పరీక్షలు.. DIEO

image

ఇంటర్ పరీక్షలు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా ప్రశాంత వాతావరణంలో జరుగుతున్నాయని ఇంటర్ విద్యాధికారి ఎర్ర అంజయ్య తెలిపారు. ఇంటర్ ద్వితీయ సంవత్సరం మ్యాథ్స్, బోటనీ, పొలిటికల్ సైన్స్ పరీక్ష జరుగుతున్న నేపథ్యంలో డీఐఈవో ఆత్మకూరు పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహిస్తున్న పరీక్షా కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులకు అన్ని మౌలిక వసతులు కల్పించినట్లు తెలిపారు.

News March 4, 2026

యుద్ధంతో వీటి ధరలు పెరుగుతాయ్!

image

ఇరాన్ వార్‌తో మనదేశంలో కంది, పెసరపప్పు ధరలు పెరిగే అవకాశం ఉంది. ఆఫ్రికా, మయన్మార్, కెనడా నుంచి భారత్ ఏటా 5-6 మిలియన్ టన్నుల పప్పుధాన్యాలు దిగుమతి చేసుకుంటోంది. ఇరాన్, అఫ్గాన్ నుంచి వచ్చే జీడిపప్పు, పిస్తా, ఎండుద్రాక్ష, కుంకుమపువ్వు, ఆప్రికాట్‌ సరఫరాపై ప్రభావం పడటంతో వాటి ధరలకూ రెక్కలొచ్చే ఛాన్స్ ఉంది. హార్ముజ్ జలసంధి నుంచి ఫెర్టిలైజర్ సప్లై కూడా నిలిచిపోవడంతో వాటి ధరలు కూడా పెరగనున్నాయి.

News March 4, 2026

కర్నూలు: నా భర్తను కనిపెట్టండి.. భార్య ఆవేదన!

image

దేవనకొండ మండలం బండగట్టుకు చెందిన కురువ ధర్మ, కురువ మౌనిక ఇష్టంతో వివాహం చేసుకున్నారు. వారం తర్వాత ధర్మ కనిపించకపోవడంతో మౌనిక తీవ్ర ఆందోళనకు గురైంది. భర్త ఆచూకీ తెలియకపోవడంతో అతని ఇంటి ముందు కూర్చొని “నాకు న్యాయం చేయాలి, నా భర్తను కనిపెట్టండి” అంటూ వేడుకుంటోంది. అయితే ధర్మ తల్లిదండ్రులు ఆమెను ఇంట్లోకి అనుమతించడం లేదు.