News March 7, 2025
VZM: జిల్లాలో నామినేటెడ్ పదవులు ఎవరికి దక్కేనో..?

మార్చిలోగా నామినేటెడ్ పదవుల కేటాయింపు ప్రక్రియను పూర్తి చేస్తామని సీఎం చంద్రబాబు ఇటీవల స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఆ దిశగా అధిష్ఠానం కసరత్తు ప్రారంభించింది. అయితే జిల్లాలో నామినేటెడ్ పదవులు ఎవరికి వరిస్తాయోనన్న చర్చ జోరుగా సాగుతుంది. ప్రధానంగా ఎస్.కోట నుంచి గొంప కృష్ణ, చీపురుపల్లి నుంచి కిమిడి నాగార్జున గత ఎన్నికల్లో టికెట్ ఆశించారు. జనసేన, బీజేపీలో కూడా ఆశావహులు ఉన్నట్లు చర్చ జరుగుతోంది.
Similar News
News March 3, 2026
VZM: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

విజయనగరంలోని వైష్ణవ వీధిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. నాయుడు ప్రసాద్ (43) సోమవారం తన సోదరితో కలిసి బైక్పై వెళ్తుండగా.. ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించే క్రమంలో అదుపుతప్పి కిందపడ్డారు. ప్రమాదంలో తలకు తీవ్ర గాయం కావడంతో ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడి భార్య ఫిర్యాదుతో SI కమల్ భార్గవ్ కేసు నమోదు చేసినట్లు చెప్పారు.
News March 3, 2026
VZM: ఇంట్లోవారిని బెదిరిద్దామని గడ్డిమందు తాగిన వ్యక్తి..

విజయనగరం (D) రేగిడి మండలం బూరాడకి చెందిన జగ్గునాయుడు కొంత కాలంగా మద్యానికి బానిస అయ్యాడు. మద్యం తాగవద్దని కుటుంబ సభ్యులు చెప్పడంతో వారిని బెదిరించేందుకు ఆదివారం సాయంత్రం తాగిన మైకంలో ఇంటి సమీపంలో గడ్డి మందు తాగాడు. అపస్మారక స్థితిలో ఉన్న జగ్గునాయుడిని కుటుంబీకులు రాజాం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించటంతో శ్రీకాకుళం రిమ్స్కి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు.
News March 3, 2026
మార్చి 4న కొత్తవలసలో ఒడిశా గవర్నర్ పర్యటన

ఒడిశా రాష్ట్ర గవర్నర్ కంభంపాటి హరిబాబు మార్చి 4వ తేదీన కొత్తవలస మండలంలో పర్యటించనున్నారు. మండలంలోని శ్రీ గురుదేవ ఛారిటబుల్ ట్రస్ట్, హాస్పిటల్ను ఆయన సందర్శించనున్నారు. ఈ మేరకు గవర్నర్ పర్యటనకు అవసరమైన అన్ని ఏర్పాట్లను పకడ్బందీగా నిర్వహించాలని వివిధ శాఖల అధికారులను కలెక్టర్ రాంసుందర్ రెడ్డి ఆదేశించారు.


