News March 7, 2025

సీతంపేట కంపెనీకి జాతీయ స్థాయి అవార్డు

image

సీతంపేట మండలంలోని మన్యం సహజ రైతు ఉత్పత్తిదారుల కంపెనీ జాతీయ స్థాయి భారత్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ ఫర్ కలెక్టివ్ ఎంటర్ప్రైజెస్ అవార్డుకు ఎంపికైనట్లు డైరెక్టర్లు నూక సన్యాసిరావు, కర్రేక గౌరమ్మ గురువారం తెలిపారు. సీతంపేట ఈ అవార్డుకు ఎంపిక కావడం గర్వకారణమని వారు పేర్కొన్నారు. రైతులు మెరుగైన ఆదాయం పొందడంతో పాటు మహిళల్లో నైపుణ్యాల అభివృద్ధికి ఈ కంపెనీ ఉపయోగపడుతుందని సీఈఓ బి.శంకరరావు తెలిపారు.

Similar News

News March 9, 2025

NGKL: SLBC టన్నెల్‌లో మృతదేహాల కోసం ప్రయత్నం

image

దోమలపెంట ఎస్ఎల్బీసీ టన్నెల్‌లో చిక్కుకున్న ఎనిమిది మంది కార్మికులు సజీవ సమాధి అయినట్లు తెలుస్తోంది. వారి మృతదేహాలను వెలికి తీసేందుకు అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఓ వ్యక్తి మృతదేహాన్ని వెలికి తీసినప్పటికీ అతనికి సంబంధించిన వివరాలను అధికారికంగా ప్రకటించలేదు. ఆ మృతదేహం పక్కనే మరో రెండు మృతదేహాలు ఉన్నప్పటికీ వాటిని వెలికి తీసేందుకు అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు.

News March 9, 2025

విజయశాంతికి ఎమ్మెల్సీ టికెట్

image

TG: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించింది. విజయశాంతి, అద్దంకి దయాకర్, శంకర్ నాయక్ పేర్లను ప్రకటించింది. ఒక మహిళ, ఒక ఎస్సీ, ఒక ఎస్టీ అభ్యర్థికి అవకాశం కల్పించింది. నాలుగు స్థానాల్లో ఒకటి సీపీఐకి ఇచ్చిన సంగతి తెలిసిందే.

News March 9, 2025

నల్గొండ: తండ్రి అంతిమ సంస్కారాలు చేసిన కుమార్తె

image

నల్గొండ జిల్లా నకిరేకల్‌లో సీపీఐ ఎంఎల్ జనశక్తి సీనియర్ నాయకులు చిట్టూరి సోమయ్య అనారోగ్యంతో మరణించడంతో ఆయన కుమార్తె తెలంగాణ ఉద్యమ సారథి కళాకారిణి పల్స నిర్మల అంతిమ సంస్కారాలు నిర్వహించారు. సోమయ్యకు ఒక్కరే సంతానం కావడంతో అన్నీ తానై తన తండ్రి అంత్యక్రియలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అరుణోదయ విమలక్కతో పాటు కళాకారులు ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు. సోమయ్య మృతితో నకిరేకల్‌లో విషాదఛాయలు అలుముకున్నాయి.

error: Content is protected !!