News March 7, 2025

రాజమండ్రి : డ్రంక్ &డ్రైవ్ కేసులో ఒకరికి జైలు శిక్ష.. 29 మందికి జరిమానా

image

రాజమండ్రిలో నిర్వహించిన డ్రంక్ & డ్రైవ్ కేసులో పట్టుబడ్డ 30 మందికి కోర్టు శిక్ష విధించిందని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. గురువారం రాజమండ్రి కోర్టులో వీరిని హాజరుపరచగా జడ్జి సి.రమ్య ఆధ్వర్యంలో 29 మందికి ఒక్కొక్కరికి రూ.10వేలు చొప్పున రూ.2.90లక్షలు జరిమానా, ఒకరికి రెండు రోజులు జైలు శిక్ష విధించింది. 

Similar News

News March 23, 2026

పోలీస్ PGRSకు ఫిర్యాదుల వెల్లువ

image

తూర్పుగోదావరి జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం PGRS కార్యక్రమాన్ని SP డి.నరసింహ కిషోర్ నిర్వహించారు. బాధితుల నుంచి 47 ఫిర్యాదులను స్వీకరించి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం సంబంధిత అధికారులతో ఫోన్‌లో మాట్లాడి, చట్ట పరిధిలో త్వరితగతిన సమస్యలను పరిష్కరించి సత్వర న్యాయం చేయాలని ఆదేశించారు. పోలీస్ సేవలను ప్రజలకు మరింత చేరువ చేయడమే లక్ష్యమని ఈ సందర్భంగా SP స్పష్టం చేశారు.

News March 23, 2026

దొమ్మేటి జయంతి.. SP నరసింహ కిషోర్ నివాళి

image

తూర్పుగోదావరి జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం శెట్టిబలిజ పితామహుడు దొమ్మేటి వెంకటరెడ్డి జయంతి వేడుకలు జరిగాయి. SP నరసింహ కిషోర్ ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అణగారిన వర్గాల అభివృద్ధికి, విద్యకు ఆయన చేసిన కృషిని కొనియాడారు. దొమ్మేటి సేవలను గుర్తించి ప్రభుత్వం ఆయన జయంతిని రాష్ట్ర పండుగగా ప్రకటించిందని SP పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

News March 23, 2026

CM ఆదేశం.. కలెక్టర్ వేగం.. పోసిబాబుకు అందిన సాయం

image

2025 జూలై 1న మలకపల్లి గ్రామంలో పోసిబాబు ఇంటి పరిస్థితిని ప్రత్యక్షంగా చూసిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఇంటి పునర్నిర్మాణం చేయాలని, స్వయం ఉపాధి కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఈమేరకు కలెక్టర్ కీర్తి చేకూరి స్పందించి ఇంటి మరమ్మతులు, మౌలిక సదుపాయాలు కల్పించారు. ఉపాధి కోసం చెప్పుల దుకాణం ఏర్పాటు దిశగా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు కూడా కుటుంబానికి అండగా నిలిచారు.