News March 23, 2024
‘ఉత్తరాఖండ్ టన్నెల్’ నిర్మించిన సంస్థ నుంచి బీజేపీకి భారీ డొనేషన్

ఎలక్టోరల్ బాండ్ దాతల్లో ఎక్కువగా తెలుగు రాష్ట్రాలకు చెందిన కంపెనీలే ఉండటం చర్చనీయాంశమైంది. వీటిలో ఉత్తరాఖండ్లో ఇటీవల కూలిన సిల్క్యారా-బార్కోట్ టన్నెల్ నిర్మాత నవయుగ ఇంజినీరింగ్ కంపెనీ కూడా ఉంది. ఈ సంస్థ 2019 ఏప్రిల్ నుంచి 2022 అక్టోబరు మధ్య రూ.55కోట్లు విలువైన బాండ్లు కొని చేసి బీజేపీకి విరాళంగా ఇచ్చింది. ఇక అదే ఏడాది టన్నెల్ నిర్మాణ పూర్తికి డెడ్లైన్ ఉండగా అది కేంద్రం పొడిగించడం గమనార్హం.
Similar News
News September 14, 2025
తిరుమల శ్రీవారి దర్శనానికి 24గంటల సమయం

AP: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతూనే ఉంది. కంపార్టుమెంట్లన్నీ నిండిపోయి సర్వదర్శనం క్యూ లైన్ కృష్ణ తేజ గెస్ట్ హౌస్ నుంచి కొనసాగుతోంది. వేంకటేశ్వరస్వామి దర్శనానికి 18 నుంచి 24 గంటల సమయం పడుతుందని టీటీడీ తెలిపింది. శనివారం 82,149 మంది స్వామి వారిని దర్శించుకోగా 36,578 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ.3.85 కోట్లు వచ్చిందని ప్రకటించింది.
News September 14, 2025
నేడు మళ్లీ చర్చలు.. విఫలమైతే కాలేజీలు బంద్

TG: ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల కోసం ఫెడరేషన్ ఆఫ్ అసోసియేషన్స్ ఆఫ్ తెలంగాణ హయ్యర్ ఇనిస్టిట్యూషన్స్(FATHI) రేపటి నుంచి ఇంజినీరింగ్ కాలేజీల <<17690252>>బంద్కు<<>> పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. నిధుల విడుదలపై నిన్న Dy.CM భట్టి, మంత్రి శ్రీధర్ బాబుతో FATHI జరిపిన చర్చలు విఫలమయ్యాయి. ఇవాళ మరోసారి మీటింగ్ జరగనుంది. సయోధ్య కుదరకపోతే రేపటి నుంచి ప్రొఫెషనల్ కాలేజీలు, 16 నుంచి డిగ్రీ, PG కాలేజీలు బంద్ చేసే అవకాశముంది.
News September 14, 2025
మైథాలజీ క్విజ్ – 5

1. 8 దిక్కులు మనకు తెలుసు. మరి 10 దిశల్లో మరో రెండు దిశలు ఏవి?
2. గోదావరి నది ఏ జ్యోతిర్లింగ క్షేత్ర సమీపంలో జన్మించింది?
3. వసంత పంచమి ఏ తెలుగు మాసంలో వస్తుంది?
4. అంబ ఎవరిపై ప్రతీకారం తీర్చుకునేందుకు శిఖండిగా పుట్టింది?
5. జనకుడికి నాగలి చాలులో ఎవరు కనిపించారు? (సరైన సమాధానాలను రేపు 7AM పబ్లిష్ చేస్తాం.)
– <<17690127>>మైథాలజీ క్విజ్-4<<>> ఆన్సర్స్: 1.శివుడు 2.రావణుడు 3.కేరళ 4.పూరీ జగన్నాథ ఆలయం 5.వరాహ అవతారం