News March 23, 2024

‘ఉత్తరాఖండ్ టన్నెల్’ నిర్మించిన సంస్థ నుంచి బీజేపీకి భారీ డొనేషన్

image

ఎలక్టోరల్ బాండ్ దాతల్లో ఎక్కువగా తెలుగు రాష్ట్రాలకు చెందిన కంపెనీలే ఉండటం చర్చనీయాంశమైంది. వీటిలో ఉత్తరాఖండ్‌లో ఇటీవల కూలిన సిల్క్‌యారా-బార్కోట్ టన్నెల్‌ నిర్మాత నవయుగ ఇంజినీరింగ్ కంపెనీ కూడా ఉంది. ఈ సంస్థ 2019 ఏప్రిల్ నుంచి 2022 అక్టోబరు మధ్య రూ.55కోట్లు విలువైన బాండ్లు కొని చేసి బీజేపీకి విరాళంగా ఇచ్చింది. ఇక అదే ఏడాది టన్నెల్ నిర్మాణ పూర్తికి డెడ్‌లైన్ ఉండగా అది కేంద్రం పొడిగించడం గమనార్హం.

Similar News

News October 2, 2024

సైబర్ క్రైమ్‌లో ఫిర్యాదు చేశాం: సురేఖ

image

TG: తనపై ట్రోలింగ్ చేసిన సోషల్ మీడియా అకౌంట్లపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు మంత్రి కొండా సురేఖ వెల్లడించారు. ఇక్కడి 3, దుబాయ్ నుంచి మరో 3 ఖాతాల ద్వారా ట్రోల్ చేశారన్నారు. ‘ఐదేళ్లు BRSలో పనిచేశా. నా వ్యక్తిత్వం అందరికీ తెలుసు. రాజకీయాల్లో విలువలు దిగజారిపోయాయి. మా ప్రభుత్వ తప్పులను ఎత్తిచూపాలి. ఈ ఘటనపై KTR ఎందుకు స్పందించలేదు? ఆయనకు మనుషుల అనుబంధాల విలువ తెలుసా?’ అని ప్రశ్నించారు.

News October 2, 2024

ICC నం.1 టెస్టు బౌలర్‌గా జస్ప్రీత్ బుమ్రా

image

బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో టీమ్ఇండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా 11 వికెట్లు తీసి సత్తా చాటిన విషయం తెలిసిందే. ఈ సిరీస్‌లో అద్భుత ప్రదర్శనతో ఐసీసీ వరల్డ్ ర్యాంకింగ్స్‌లో ప్రథమ స్థానానికి చేరుకున్నారు. 870 పాయింట్స్‌తో బుమ్రా నం.1 టెస్టు బౌలర్‌గా నిలిచారు. ఇప్పటివరకు నం.1గా ఉన్న అశ్విన్ రెండో స్థానానికి పడిపోయారు. అశ్విన్ కూడా బంగ్లాతో టెస్టు సిరీస్‌లో 11 వికెట్లు తీయడం గమనార్హం.

News October 2, 2024

విజయ్ లాస్ట్ మూవీ.. ‘భగవంత్ కేసరి’ రీమేక్?

image

రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన తమిళ హీరో విజయ్ తన చివరి చిత్రం ‘దళపతి 69’ని ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే బాలకృష్ణ నటించిన ‘భగవంత్ కేసరి’కి ఈ చిత్రం రీమేక్ అని కోలీవుడ్ మీడియాలో వార్తలొస్తున్నాయి. గుడ్ టచ్, బ్యాడ్ టచ్‌తో పాటు ఆడపిల్లలను పేరెంట్స్ ఎలా పెంచాలనే మెసేజ్ ఓరియెంటెడ్ కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రమైతే సేఫ్ సైడ్ అని విజయ్ ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటనేమీ రాలేదు.