News March 7, 2025

అనకాపల్లి జిల్లాలో ఫ్రీ బస్.. మీ కామెంట్

image

RTC ఉచిత బస్సు ప్రయాణాన్ని జిల్లా వరకే పరిమితం చేస్తామని మంత్రి గుమ్మడి సంధ్యారాణి ప్రకటించారు. అనకాపల్లి జిల్లా వాసులు ఎక్కువగా విశాఖ, శ్రీకాకుళం వెళ్తుంటారు. విశాఖలో ఇంజినీరింగ్ కాలేజీలు ఉండటంతో విద్యార్థినీలు నిత్యం రాకపోకలు సాగిస్తుంటారు. మంత్రి ప్రకటన మేరకు వీరంతా విశాఖ, సిక్కోలు వెళ్లాలంటే టికెట్ కొనాల్సిందే. ఇలా జిల్లా బార్డర్‌లో ఉండే వారికి ఉచిత ప్రయాణం వర్తించదు. దీనిపై కామెంట్.

Similar News

News January 12, 2026

ప్రభుత్వ ఉద్యోగులకు CM సంక్రాంతి కానుక

image

TG: సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగులందరికీ ఒక డీఏ చెల్లిస్తున్నట్లు సీఎం రేవంత్​ రెడ్డి ప్రకటించారు. దీంతో ఇప్పుడున్న డీఏ మరో 3.64 శాతం పెరుగుతుంది. 2023 జులై నుంచి పెంచిన DA అమల్లోకి వస్తుంది. దీనికి సంబంధించిన ఉత్తర్వులు జారీ చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఈ డీఏ పెంపుతో ప్రభుత్వంపై రూ.227 కోట్ల భారం పడనుంది. అటు ఉద్యోగులకు రూ.కోటి ప్రమాద బీమా ఇవ్వాలని నిర్ణయించామన్నారు.

News January 12, 2026

విశాఖ: కొడుకుతో బైక్‌పై వెళుతున్న తల్లి.. ప్రమాదంలో మృతి

image

నగరంలోని బర్మా క్యాంపునకు చెందిన రమణి తన కొడుకుతో బైక్‌పై రమా టాకీస్ వైపు వెళుతుండగా బైక్ హ్యండిల్‌కు బస్సు తగలడంతో అదుపు తప్పి కిందపడ్డారు. అనంతరం RTC బస్సు వెనుక చక్రం ఆమె పైనుంచి వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందారు. రెప్పపాటులో జరిగిన ప్రమాదంలో తల్లి మృతి చెందడంతో కుమారుడు నిశ్చేష్ఠుడయ్యాడు. తల్లి మృతదేహం వద్ద ఏడ్చిన తీరు కంటతడి పెట్టింది. ద్వారక పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

News January 12, 2026

మేడారం జాతర బ్రోచర్‌ను ఆవిష్కరించిన సీఎం

image

గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన మేడారం మహా జాతర బ్రోచర్‌, పోస్టర్‌ను ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఈరోజు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కొండా సురేఖ, ధనసరి అనసూయ (సీతక్క), అడ్లూరి లక్ష్మణ్ కుమార్, పార్లమెంట్ సభ్యుడు పోరిక బలరాం నాయక్, గిరిజన ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈనెల 18న మేడారానికి వస్తున్న సీఎం, 19న పూర్తయిన అభివృద్ధి పనులను ఆవిష్కరిస్తారు.