News March 7, 2025
ఫ్రీ జర్నీ జిల్లాకే పరిమితం.. మీ కామెంట్

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించేందుకు ప్రభుత్వం ముమ్మర కసరత్తు చేస్తోంది. అయితే ‘ఏ జిల్లా మహిళలకు.. ఆ జిల్లాలో మాత్రమే ఆర్టీసీలో ఉచిత ప్రయాణానికి అనుమతించాలని నిర్ణయించాం’ అని మంత్రి సంధ్యారాణి మండలిలో ప్రకటన చేశారు. ఈ లెక్కన కర్నూలు, నంద్యాలలోని మహిళల ఉచిత ప్రయాణాలు ఆ జిల్లాల వరకే పరిమితం అవుతాయి. పక్క జిల్లాలో ప్రయాణించాలంటే బార్డర్ నుంచి టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. దీనిపై మీ కామెంట్..
Similar News
News March 14, 2026
వరి ఉత్పత్తిలో తెలంగాణ నంబర్ వన్: తుమ్మల

TG: వరి ఉత్పత్తిలో దేశంలో తెలంగాణ నంబర్ వన్ ప్లేస్లో ఉందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఈ క్రమంలో రైతులకు మెరుగైన ఆదాయం అందించేందుకు ఎగుమతులు, విలువ ఆధారిత ఉత్పత్తులు, ఫుడ్ ప్రాసెసింగ్లపై దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్ర వ్యవసాయ ఉత్పత్తులు అంతర్జాతీయ మార్కెట్లో పోటీ పడేలా గ్రేడింగ్, ప్రాసెసింగ్, బ్రాండింగ్, నాణ్యతా ప్రమాణాలు మరింత బలోపేతం కావాల్సిన అవసరం ఉందన్నారు.
News March 14, 2026
HYD: అనసూయపై అసభ్యకర మెసేజ్లు చేసింది ఇతడే!

నటి అనసూయను సోషల్ మీడియాలో వేధించిన వ్యక్తిని సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. ఆన్లైన్లో వేధింపులపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడు జనార్థన్ను(26)ను అదుపులోకి తీసుకున్నారు. ఏపీ కడప జిల్లాకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. కొంతకాలంగా నగరంలో నివాసం ఉంటున్నాడు. ఇటీవల అనసూయ మీద SMలో అసభ్యకరమైన మెసేజ్లు చేయడంతో ఆమె ఫిర్యాదు మేరకు అదుపులోకి తీసుకున్నారు. పలు సెక్షన్ల కింద కేసు నమోదైంది.
News March 14, 2026
పెద్దపల్లి: ‘రేపు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి పాదయాత్ర’

మహాశక్తి ఆలయం కరీంనగర్ నుండి కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి సంజయ్ కుమార్ ఆధ్వర్యంలో రేపు కొండగట్టు వరకు మహా పాదయాత్ర నిర్వహిస్తున్నారు. కావున పెద్దపల్లి జిల్లా ఆయా మండలాల నుండి అధిక సంఖ్యలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు హిందూ బంధువులు పాల్గొని మహా పాదయాత్ర ను విజయవంతం చేయాలని జిల్లా ప్రధాన కార్యదర్శి అశోక్ రావు పెద్దపల్లి బీజేపీ కార్యాలయం నుండి పిలుపు నిచ్చారు. కార్యక్రమంలో నల్ల మనోహర్ రెడ్డి ఉన్నారు.


