News March 7, 2025
తిరుపతి: గుండెపోటుతో ఈశ్వర్ రెడ్డి మృతి

రామచంద్రాపురం మండలంలోని నెన్నూరు పంచాయతీలోని 8వ వార్డు సభ్యుడు కుసాకల ఈశ్వర్ రెడ్డి ఇవాళ ఉదయం 5 గంటలకు నెన్నూరులోని ఆయన స్వగృహంలో గుండెపోటుతో మృతి చెందారు. ఈశ్వర్ రెడ్డి మృతి చెందడంతో పలు రాజకీయ నాయకులు నెన్నూరు సర్పంచ్, మిగిలిన వార్డు సభ్యులు ఆయనకు నివాళులు అర్పించారు.
Similar News
News March 12, 2026
GWL: పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163.. ఎస్పీ శ్రీనివాసరావు

ఈనెల13 నుంచి ఏప్రిల్ 16 వరకు జరిగే పదో తరగతి పరీక్షా కేంద్రాల వద్ద సెక్షన్ 163 అమలులో ఉంటుందని గద్వాల ఎస్పీ శ్రీనివాసరావు గురువారం తెలిపారు. జిల్లాలోని అన్ని పరీక్షా కేంద్రాల చుట్టూ 200 మీటర్ల పరిధిలో ఐదుగురికి మించి గుమి గూడాటాన్ని నిషేధించామన్నారు. ప్రతిరోజు ఉదయం 7:00 నుంచి మధ్యాహ్నం 3:00 వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయన్నారు. పరీక్ష కేంద్రాల పరిసరాల్లో జిరాక్స్ సెంటర్లు మూసి ఉంచాలన్నారు.
News March 12, 2026
ప.గో: డ్రోన్ల వినియోగం భేష్.. కలెక్టర్కు సీఎం ప్రశంస

కలెక్టర్ల సమావేశంలో ప.గో కలెక్టర్ నాగరాణి పనితీరుపై ముఖ్యమంత్రి ప్రశంసలు కురిపించారు. జిల్లాలో 45 డ్రోన్లను వ్యవసాయ సాగుతో పాటు, విద్యుత్తు లైన్ల నిర్మాణంలో పోల్ టు పోల్ వైర్లను అమర్చేందుకు ఉపయోగిస్తున్నట్లు కలెక్టర్ వివరించారు. దీనివల్ల తక్కువ సమయంలో పనులు పూర్తవుతున్నాయని తెలిపారు. ఈ వినూత్న ప్రయోగాన్ని గతంలో ఎన్నడూ వినలేదని పేర్కొంటూ సీఎం ఆమెను ప్రత్యేకంగా అభినందించారు.
News March 12, 2026
ఎండల తీవ్రత పట్ల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్

జిల్లాలో వేసవి తీవ్రత పెరుగుతున్న దృష్ట్యా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ డా. ఎన్.ప్రభాకర రెడ్డి తెలిపారు. గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. అత్యవసరమైతే తప్ప మధ్యాహ్నం వేళల్లో బయటకు రావద్దని, వడగాల్పుల బారిన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా చిన్నారులు, పశువుల సంరక్షణ విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆయన సూచించారు.


